బహ్రెయిన్ 6వ లెజిస్టేటివ్ టెర్మ్ 3వ సెషన్ ప్రారంభం..!!
- October 14, 2024
మనామా: బహ్రెయిన్ 6వ లెజిస్టేటివ్ టెర్మ్ 3వ సెషన్ ప్రారంభమైంది. ఈసా కల్చరల్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హాజరయ్యారు. కింగ్ కు రాగానే రిప్రజెంటేటివ్స్ కౌన్సిల్ స్పీకర్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్ ముసల్లం, షురా కౌన్సిల్ చైర్మన్ అలీ బిన్ సలేహ్ అల్ సలేహ్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంస్థలు, చట్టాల నిర్మాణంలో తమ జాతీయ ప్రయోజనాలను పరిరక్షించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.జాతీయ ప్రయోజనాలు గత 25 సంవత్సరాలలో బహ్రెయిన్ పురోగతిని ప్రతిబింబిస్తూ, స్థిరమైన చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ప్రాముఖ్యతను వివరించారు. బహ్రెయిన్ ఎకనామిక్ విజన్ 2030పై మళ్లీ దృష్టి పెట్టాలని అధికారులను ఆయన కోరారు. 2050 కోసం ముందుకు చూసే దృక్పథం కోసం పిలుపునిచ్చారు. పౌరులందరికీ ప్రయోజనం చేకూర్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి