పర్సనల్ ట్రైనర్ల పై నిషేధం..జెఎల్టి టవర్ల నివాసితులు ఆగ్రహం..!!
- October 15, 2024
దుబాయ్: జుమేరా లేక్స్ టవర్స్ (JLT)లోని జిమ్, పూల్ నుండి పర్సనల్ ట్రైనర్లను నిషేధించారు.దీనిపై జుమేరా లేక్స్ టవర్స్ నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నివాసితుల హక్కులపై దాడిగా పేర్కొన్నారు. JLT క్లస్టర్ Sలోని గ్రీన్ లేక్ టవర్స్ 1, 2 ఎలివేటర్లలో కొత్త నిబంధన గురించి నివాసితులకు తెలియజేస్తూ నోటీసులు అంటించారు. అధిక రద్దీని నివారించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేనేజ్ మెంట్ ప్రకటించింది.అయితే, వ్యక్తిగత శిక్షకుల కార్యకలాపాలను అనుమతించే విషయం JLTలోని టవర్లలో నివసించే వారి సంఘాల బాధ్యత అని, డెవలపర్ కు దీనితో ఏం సంబంధమని నివాసితులు ప్రశ్నిస్తున్నారు.
అనేక మంది నివాసితులు ఆరోగ్య కారణాల కోసం వ్యక్తిగత శిక్షకులను ఏర్పాటు చేసుకుంటున్నారు. కాగా, ఈ నిషేధం వారిని గందరగోళానికి గురి చేసింది.ఈ నిర్ణయం పై ఏడేళ్లపాటు భవనంలో నివసిస్తున్న ఓ నివాసితురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. "నా భర్త తప్పుగా వ్యాయామం చేయడం వల్ల వెన్నులో సమస్య వచ్చింది.దీంతో నేను వ్యక్తిగత శిక్షకుడిని నియమించుకున్నాను. జిమ్ సౌకర్యాలను సురక్షితంగా ఉపయోగించడానికి మేము వృత్తిపరమైన సహాయాన్ని ఎంచుకున్నాము." అని పేర్కొన్నారు. అదేవిధంగా మరొక నివాసి తన ఆరోగ్యంపై నిషేధం ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. "నా దీర్ఘకాలిక పరిస్థితి కారణంగా జిమ్, నడక, స్విమ్మింగ్ వంటి తీవ్రమైన శారీరక శిక్షణను నా వైద్యుడు సిఫార్సు చేసాడు. ఈ కార్యకలాపాలు చేయడానికి నాకు PT అవసరం. గత వారం వరకు క్రమం తప్పకుండా వస్తున్న నా శిక్షకుడు ఈ నిషేధం కారణంగా రావడం మానేశాడు. నేను ఏదైనా తప్పు జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారు. ’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మెయింటెనెన్స్ ఫీజులో సంవత్సరానికి Dh37,000 చెల్లిస్తాము. మరమ్మత్తులకు ఇది సరిపోదా? అని మరోక ఇంటి యజమాని ప్రశ్నించారు. "ఈత కోచ్లను అనుమతించడం లేదని, నా కొడుకు పాఠాలకు అంతరాయం కలుగుతుందని మాకు ఆకస్మికంగా తెలియజేయబడింది." అని మరో నివాసి ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 50 మంది సభ్యులతో వాట్సాప్ సమూహాన్ని నివాసితులు ఏర్పాటు చేశారు. సర్టిఫైడ్ ట్రైనర్లను నమోదు నుంచి రద్దీని నివారించడానికి యూజింగ్ లాగ్ను నిర్వహించడం వంటి పరిష్కారాలను అందులో ప్రతిపాదించారు. అయితే, ఈ సూచనలపై ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీ స్పందించలేదని సమాచారం. "విచిత్రమేమిటంటే, ఈ నిషేధం క్లస్టర్ Sలోని రెండు టవర్లకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన భవనాలు ఈ పరిమితులు లేవు" అని పలువురు నివాసితులు వాపోతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







