బుర్జ్ ఖలీఫా న్యూఇయర్ వేడుకలు..150శాతం పెరిగిన టిక్కెట్ల ధరలు..!!
- October 15, 2024
దుబాయ్: బుర్జ్ ఖలీఫాలో న్యూఇయర్ వేడుకలు చూసేందుకు టిక్కెట్ల ధరలను ప్రకటించారు. పెద్దలకు Dh580, 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు Dh370గా నిర్ణయించారు. టిక్కెట్లు అక్టోబర్ 24 నుండి అందుబాటులో ఉంటాయి. టిక్కెట్ ధరలో ఫుడ్, డ్రింక్స్ వోచర్ ఉంటుంది. నిర్వాహకులు గత సంవత్సరం మొదటిసారిగా బుర్జ్ ఖలీఫా వద్ద న్యూఇయర్ వేడుకల ఎంట్రీకి టిక్కెట్లను ప్రవేశపెట్టారు. పెద్దలకు 300 దిర్హామ్లు, పిల్లలకు 150 దిర్హామ్లు వసూలు చేశారు. అయితే, డౌన్టౌన్ దుబాయ్లోని ఇతర ప్రాంతాలలో ఉచితంగా న్యూఇయర్ వేడుకలను వీక్షించవచ్చని ఎమ్మార్ ప్రకటించింది. డిసెంబర్ 31 మధ్యాహ్నం 3.30 గంటల నుండి వేడుకలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి