బుర్జ్ ఖలీఫా న్యూఇయర్ వేడుకలు..150శాతం పెరిగిన టిక్కెట్ల ధరలు..!!
- October 15, 2024
దుబాయ్: బుర్జ్ ఖలీఫాలో న్యూఇయర్ వేడుకలు చూసేందుకు టిక్కెట్ల ధరలను ప్రకటించారు. పెద్దలకు Dh580, 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు Dh370గా నిర్ణయించారు. టిక్కెట్లు అక్టోబర్ 24 నుండి అందుబాటులో ఉంటాయి. టిక్కెట్ ధరలో ఫుడ్, డ్రింక్స్ వోచర్ ఉంటుంది. నిర్వాహకులు గత సంవత్సరం మొదటిసారిగా బుర్జ్ ఖలీఫా వద్ద న్యూఇయర్ వేడుకల ఎంట్రీకి టిక్కెట్లను ప్రవేశపెట్టారు. పెద్దలకు 300 దిర్హామ్లు, పిల్లలకు 150 దిర్హామ్లు వసూలు చేశారు. అయితే, డౌన్టౌన్ దుబాయ్లోని ఇతర ప్రాంతాలలో ఉచితంగా న్యూఇయర్ వేడుకలను వీక్షించవచ్చని ఎమ్మార్ ప్రకటించింది. డిసెంబర్ 31 మధ్యాహ్నం 3.30 గంటల నుండి వేడుకలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









