అక్రమార్జన ఆరోపణలు. ముగ్గురు ఆసియన్ ఉద్యోగులకు ఊరట..!!

- October 16, 2024 , by Maagulf
అక్రమార్జన ఆరోపణలు. ముగ్గురు ఆసియన్ ఉద్యోగులకు ఊరట..!!

మనామా: తమ కంపెనీ గిడ్డంగి నుండి 18,000 బహ్రెయిన్ దినార్ల (సుమారు $47,700 USD) విలువైన వస్తువులను అపహరించినందుకు ముగ్గురు ఆసియా ఉద్యోగులను హైకోర్టు అప్పీల్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వేర్‌హౌస్ స్టాక్‌లో తేడా ఉందని ఆరోపిస్తూ కంపెనీ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ కేసు నమోదైంది. కంపెనీ మొదట్లో ఇద్దరు సేల్స్ రిప్రజెంటేటివ్‌లను ఇంప్లీడ్ చేసింది. తర్వాత వారిని విచారించి అభియోగాలు మోపారు. తమకు ఎలాంటి ప్రమేయం లేదని విచారణలో వారు తెలిపారు. గతంలోనే స్టాక్ లో తేడా ఉందని కమ్యూనికేషన్ రికార్డ్‌లతో సహా సాక్ష్యాలను బాధితుల తరఫున లాయర్లు కోర్టుకు అందించారు. ముగ్గురు ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటిస్తూ అప్పీల్ కోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com