మనామా సౌక్ పునరుజ్జీవన ప్రణాళిక.. పార్లమెంటులో ఓటింగ్..!!
- October 26, 2024
మనామా: చారిత్రాత్మక మార్కెట్గా ఉన్న మనామా సౌక్ను పునరుజ్జీవింపజేయాలని ప్రభుత్వాన్ని కోరే ప్రతిపాదనపై ప్రతినిధుల సభ ఓటు వేయనుంది. ఎంపీలు అహ్మద్ కరాటా, మొహసేన్ అల్ అస్బౌల్, మహమూద్ మీర్జా, హసన్ బుక్మాస్, మమ్దౌహ్ అల్ సలేహ్ ఈ ప్రతిపాదనను సమర్పించారు. సౌక్ చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యతను పునరుద్ధరించడం, బహ్రెయిన్ సంప్రదాయాలు, వారసత్వాన్ని పర్యాటకులకు ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతినిధుల సభ సర్వీసెస్ కమిటీ ఈ ప్రతిపాదనను ఆమోదించాలని సిఫార్సు చేసింది. మనామా సౌక్ అనేది బహ్రెయిన్లోని పురాతన అత్యంత ముఖ్యమైన వాణిజ్య కేంద్రాలలో ఒకటి. ఇది దేశవ్యాప్తంగా టోకు వ్యాపారులకు, రిటైలర్లకు ప్రధాన కేంద్రంగా సేవలు అందిస్తుంది. ప్రస్తుతం సౌక్ నిర్మాణ సమస్యలతోపాటు పార్కింగ్ , పబ్లిక్ సౌకర్యాలు లేకపోవడం (రెస్ట్రూమ్లు, షేడెడ్ ఏరియాలు, రెస్టారెంట్లు మొదలైనవి),ఇతర మౌలిక సదుపాయాల సమస్యలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పర్యాటక మంత్రిత్వ శాఖ మనామా సౌక్లోని కీలక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కన్సల్టింగ్ ఇంజనీరింగ్ సంస్థను నియమించడానికి టెండర్ బోర్డు ద్వారా టెండర్ జారీ చేసింది. ఈ ప్రణాళికకు అధికారిక మద్దతు లభిస్తుందో లేదో రాబోయే పార్లమెంటరీ ఓటింగ్ నిర్ణయిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







