మనామా సౌక్ పునరుజ్జీవన ప్రణాళిక.. పార్లమెంటులో ఓటింగ్..!!
- October 26, 2024
మనామా: చారిత్రాత్మక మార్కెట్గా ఉన్న మనామా సౌక్ను పునరుజ్జీవింపజేయాలని ప్రభుత్వాన్ని కోరే ప్రతిపాదనపై ప్రతినిధుల సభ ఓటు వేయనుంది. ఎంపీలు అహ్మద్ కరాటా, మొహసేన్ అల్ అస్బౌల్, మహమూద్ మీర్జా, హసన్ బుక్మాస్, మమ్దౌహ్ అల్ సలేహ్ ఈ ప్రతిపాదనను సమర్పించారు. సౌక్ చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యతను పునరుద్ధరించడం, బహ్రెయిన్ సంప్రదాయాలు, వారసత్వాన్ని పర్యాటకులకు ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతినిధుల సభ సర్వీసెస్ కమిటీ ఈ ప్రతిపాదనను ఆమోదించాలని సిఫార్సు చేసింది. మనామా సౌక్ అనేది బహ్రెయిన్లోని పురాతన అత్యంత ముఖ్యమైన వాణిజ్య కేంద్రాలలో ఒకటి. ఇది దేశవ్యాప్తంగా టోకు వ్యాపారులకు, రిటైలర్లకు ప్రధాన కేంద్రంగా సేవలు అందిస్తుంది. ప్రస్తుతం సౌక్ నిర్మాణ సమస్యలతోపాటు పార్కింగ్ , పబ్లిక్ సౌకర్యాలు లేకపోవడం (రెస్ట్రూమ్లు, షేడెడ్ ఏరియాలు, రెస్టారెంట్లు మొదలైనవి),ఇతర మౌలిక సదుపాయాల సమస్యలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పర్యాటక మంత్రిత్వ శాఖ మనామా సౌక్లోని కీలక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కన్సల్టింగ్ ఇంజనీరింగ్ సంస్థను నియమించడానికి టెండర్ బోర్డు ద్వారా టెండర్ జారీ చేసింది. ఈ ప్రణాళికకు అధికారిక మద్దతు లభిస్తుందో లేదో రాబోయే పార్లమెంటరీ ఓటింగ్ నిర్ణయిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







