కీలక ఉద్యోగాలు బహ్రెయిన్లతో భర్తీ.. ప్రతిపాదించిన ఎంపీలు..!!
- October 26, 2024
మనామా: ఇంజనీర్లు, అకౌంటెంట్లు తదితర కీలక ఉద్యోగాల్లో ప్రవాసుల స్థానంలో బహ్రెయిన్ వాసులను నియమించాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కీలక ఉద్యోగాలను స్థానికీకరించాలని కోరుతూ ఎంపి మహ్మద్ జాసిమ్ ఒలైవి ప్రతిపాదన చేశారు. బహ్రెయిన్ పౌరులకు అవసరమైన అర్హతలు ఉన్న స్థానిక గ్రాడ్యుయేట్లతో భర్తీ చేయడం ద్వారా ఉద్యోగ విఫణిలో స్థిరమైన పట్టును కల్పించాలని కోరారు. బహ్రెయిన్ రాజ్యాంగం పౌరులకు పని చేసే హక్కుకు హామీ ఇస్తుంది. ఈ ప్రతిపాదన రాజ్యాంగంలోని ఆర్టికల్ 68లోని నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంతర్గత నిబంధనలలోని ఆర్టికల్ 127, 128 ప్రకారం.. ప్రతిపాదనపై చర్చించాలని ఎంపీలు డిమాండ్ చేశారు. బహ్రెయిన్ల భవిష్యత్తు అవకాశాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఎంపీలు హెచ్చరించారు. ప్రవాసుల ఉపాధిపై పెరుగుతున్న ఆందోళనను పరిష్కరించడానికి తక్షణ చర్య తీసుకోవాలని కోరారు. ఈ ప్రతిపాదనకు ఎంపీలు జలీలా అల్ సయ్యద్, అబ్దుల్వాహిద్ ఖరాతా, అబ్దుల్నబీ సల్మాన్, లుల్వా అల్ రుమైహి మద్దతు ఇచ్చారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందినట్లయితే, ఇది బహ్రెయిన్ లేబర్ మార్కెట్లో గణనీయమైన పరివర్తనను తెచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!