నవంబర్ 15నుండి అబుదాబిలో పబ్లిక్ ఆర్ట్ ఎగ్జిబిషన్..!!
- October 27, 2024
యూఏఈ: నవంబర్ 15 నుండి ఏప్రిల్ 30, 2025 వరకు అబుదాబి, అల్ ఐన్లోని వివిధ ప్రదేశాలలో పబ్లిక్ ఆర్ట్ అబుదాబి ద్వివార్షిక మొదటి ఎడిషన్ ప్రారంభం కానుంది. సైట్-నిర్దిష్ట వర్క్లు అలాగే కమ్యూనిటీలతో నేరుగా పాల్గొనేలా కళాకారులకు స్వాగతం పలుకుతున్నారు. ఈ ఎగ్జిబిషన్ లో 70 కంటే ఎక్కువ అంతర్జాతీయ కళాకారులు పాల్గొని తమ ఆర్ట్ ఇన్స్టాలేషన్లు, ప్రదర్శనలను ఇవ్వనున్నారు. కళాకారులలో అలోరా & కాల్జాడిల్లా, ఆర్కిటెక్చురా ఎక్స్పాండిడా, క్రిస్టోఫర్ బెంటన్, ఫరా అల్ ఖాసిమి, ఫ్లయింగ్సిటీ, హషెల్ అల్ లాంకీ, కబీర్ మొహంతి, ఖలీల్ రబా, ఆస్కార్ మురిల్లో, రాధిక ఖిమ్జీ, సామీ బాలోజీ, తారిక్ కిస్వాన్సన్, వేల్ అల్ అవార్, జెమీన్ వంటి ప్రముఖులు ఉన్నారని DCT అబుదాబి చైర్మన్ మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ తెలిపారు. ప్రముఖ కళాకారుడు ఆస్కార్ మురిల్లో 80-మీటర్ల పొడవు గల కాన్వాస్ అబుదాబి వేగవంతమైన పట్టణ విస్తరణను తెలియజేస్తారు. క్రిస్టోఫర్ బెంటన్ కార్పెట్ సౌక్ను శక్తివంతమైన కమ్యూనల్ స్పేస్గా మారుస్తారు. జైనాబ్ అల్ హషేమీ అబుదాబి సెంట్రల్ బస్ టెర్మినల్ను తన ఆర్ట్ తో మార్చేస్తారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









