భారత్తో కువైట్ విమానయాన సహకారం.. కీలక చర్చలు..!!
- October 27, 2024
కువైట్ః కువైట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) హెడ్ షేక్ హుమూద్ ముబారక్ అల్-హుమూద్ అల్-జాబర్ అల్-సబాహ్.. భారత పౌర విమానయాన అథారిటీ అండర్ సెక్రటరీ అసంగ్బా చుబాతో సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలను పెంచడానికి ఒప్పందంపై సంతకం చేయడానికి కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖతో భారత అధికారులు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారతదేశం - కువైట్ మధ్య విమాన కార్యకలాపాలను పెంచడం కువైట్ ఎయిర్లైన్స్కు అత్యున్నత ప్రాధాన్యత అని పేర్కొన్నారు. మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ కాన్ఫరెన్స్ (ICAO 2024) వార్షిక సమావేశం ముగింపు సమావేశాల సందర్భంగా ఈ సమావేశం జరిగింది. అదేవిధంగా ఉగాండా, రువాండా, డొమినికన్ రిపబ్లిక్, ఒమన్తో సహా విమానయాన పరిశ్రమ అధికారులతో షేక్ హుమూద్ సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







