భారత్తో కువైట్ విమానయాన సహకారం.. కీలక చర్చలు..!!
- October 27, 2024
కువైట్ః కువైట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) హెడ్ షేక్ హుమూద్ ముబారక్ అల్-హుమూద్ అల్-జాబర్ అల్-సబాహ్.. భారత పౌర విమానయాన అథారిటీ అండర్ సెక్రటరీ అసంగ్బా చుబాతో సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలను పెంచడానికి ఒప్పందంపై సంతకం చేయడానికి కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖతో భారత అధికారులు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారతదేశం - కువైట్ మధ్య విమాన కార్యకలాపాలను పెంచడం కువైట్ ఎయిర్లైన్స్కు అత్యున్నత ప్రాధాన్యత అని పేర్కొన్నారు. మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ కాన్ఫరెన్స్ (ICAO 2024) వార్షిక సమావేశం ముగింపు సమావేశాల సందర్భంగా ఈ సమావేశం జరిగింది. అదేవిధంగా ఉగాండా, రువాండా, డొమినికన్ రిపబ్లిక్, ఒమన్తో సహా విమానయాన పరిశ్రమ అధికారులతో షేక్ హుమూద్ సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల