భారత్తో కువైట్ విమానయాన సహకారం.. కీలక చర్చలు..!!
- October 27, 2024
కువైట్ః కువైట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) హెడ్ షేక్ హుమూద్ ముబారక్ అల్-హుమూద్ అల్-జాబర్ అల్-సబాహ్.. భారత పౌర విమానయాన అథారిటీ అండర్ సెక్రటరీ అసంగ్బా చుబాతో సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలను పెంచడానికి ఒప్పందంపై సంతకం చేయడానికి కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖతో భారత అధికారులు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారతదేశం - కువైట్ మధ్య విమాన కార్యకలాపాలను పెంచడం కువైట్ ఎయిర్లైన్స్కు అత్యున్నత ప్రాధాన్యత అని పేర్కొన్నారు. మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ కాన్ఫరెన్స్ (ICAO 2024) వార్షిక సమావేశం ముగింపు సమావేశాల సందర్భంగా ఈ సమావేశం జరిగింది. అదేవిధంగా ఉగాండా, రువాండా, డొమినికన్ రిపబ్లిక్, ఒమన్తో సహా విమానయాన పరిశ్రమ అధికారులతో షేక్ హుమూద్ సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









