Dh100,000 నగదు తిరిగిచ్చిన ప్రవాస భారతీయుడు.. సన్మానించిన పోలీసులు..!!
- October 27, 2024
యూఏఈః 100,000 దిర్హామ్ల నగదును అథారిటీకి తిరిగి ఇచ్చినందుకు భారతీయ ప్రవాసిని సత్కరించినట్లు దుబాయ్ పోలీసులు ప్రకటించారు. దుబాయ్ నివాసి స్వదేశ్ కుమార్ నగరంలోని అల్ బర్షా ప్రాంతంలో నగదు దొరికింది. దానిని ఆయన నిస్వార్ధంగా పోలీసులకు అందజేశారు. ఈ సందర్భంగా స్వదేశ్కు పోలీసులు ప్రశంసా పత్రాన్ని అందించి ఘనంగా సత్కరించారు. బాధ్యత గల వ్యక్తిగా గొప్ప మానవత విలువలను కలిగి ఉన్నాడని పోలీసులు ప్రశంసించారు. అల్ బార్షా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ మాజిద్ అల్ సువైదీ మాట్లాడుతూ.. ప్రజా సహకారాన్ని పెంపొందించడం ద్వారా దుబాయ్ పోలీసులు తన వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడంలో ఇటువంటి నిజాయితీ చర్యలు సహాయపడతాయని పేర్కొన్నారు. అనంతరం "విలువైన వస్తువులు నిజమైన యజమానికి సురక్షితంగా తిరిగి వచ్చేలా చూసేందుకు అల్ బార్షా పోలీస్ స్టేషన్కి తిరిగి ఇవ్వడం తన విధి" అని కుమార్ తనకు లభించిన గుర్తింపుకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!