ఒమానీ యువజన దినోత్సవం.. సయ్యద్ థెయాజిన్ అధ్యక్షత వేడుకలు
- October 27, 2024
మనా: ఒమానీ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన వేడుకలకు సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి హెచ్హెచ్ సయ్యద్ థియాజిన్ బిన్ హైథమ్ అల్ సయీద్ అధ్యక్షత వహించారు. విలాయత్ ఆఫ్ మనా (A'Dakhiliyah గవర్నరేట్)లోని "ఒమన్ అక్రాస్ ది ఏజెస్ మ్యూజియం"లో జరిగిన ఈ వేడుకలో యూత్ ఎక్సలెన్స్ అవార్డు విజేతలను ఘనంగా సన్మానించారు. 10 థీమ్లతో కూడిన 3-రోజుల యూత్ ఇనిషియేటివ్స్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు ఆర్థిక సాంకేతికత, విద్య, ఉపాధి, శారీరక దృఢత్వం, చేతిపనులు, పర్యావరణం, మీడియా, ఇంజనీరింగ్ సహా అనేక రకాల స్పెషలైజేషన్లను కవర్ చేస్తాయని పేర్కొన్నారు. ఈ వేడుకలో గవర్నరేట్లలో యూత్ సెంటర్ శాఖలను ప్రారంభించారు. ఈ వేడుకలో ఐదు ‘సహకారం,భాగస్వామ్య ఒప్పందాలపై’ సంతకాలు జరిగాయి. వేడుక ముగింపు సందర్భంగా 2024 సంవత్సరానికి యూత్ ఎక్సలెన్స్ అవార్డు (5వ ఎడిషన్) విజేతలను హెచ్హెచ్ సయ్యద్ థెయాజిన్ సత్కరించారు. డిజిటల్ మీడియా, డిజిటల్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, యూత్ అనే ఐదు డొమైన్ల నుండి 21 మంది యువకులను ఎంపిక చేసి అవార్డులను అందజేశారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







