ఒమానీ యువజన దినోత్సవం.. సయ్యద్ థెయాజిన్ అధ్యక్షత వేడుకలు
- October 27, 2024
మనా: ఒమానీ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన వేడుకలకు సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి హెచ్హెచ్ సయ్యద్ థియాజిన్ బిన్ హైథమ్ అల్ సయీద్ అధ్యక్షత వహించారు. విలాయత్ ఆఫ్ మనా (A'Dakhiliyah గవర్నరేట్)లోని "ఒమన్ అక్రాస్ ది ఏజెస్ మ్యూజియం"లో జరిగిన ఈ వేడుకలో యూత్ ఎక్సలెన్స్ అవార్డు విజేతలను ఘనంగా సన్మానించారు. 10 థీమ్లతో కూడిన 3-రోజుల యూత్ ఇనిషియేటివ్స్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు ఆర్థిక సాంకేతికత, విద్య, ఉపాధి, శారీరక దృఢత్వం, చేతిపనులు, పర్యావరణం, మీడియా, ఇంజనీరింగ్ సహా అనేక రకాల స్పెషలైజేషన్లను కవర్ చేస్తాయని పేర్కొన్నారు. ఈ వేడుకలో గవర్నరేట్లలో యూత్ సెంటర్ శాఖలను ప్రారంభించారు. ఈ వేడుకలో ఐదు ‘సహకారం,భాగస్వామ్య ఒప్పందాలపై’ సంతకాలు జరిగాయి. వేడుక ముగింపు సందర్భంగా 2024 సంవత్సరానికి యూత్ ఎక్సలెన్స్ అవార్డు (5వ ఎడిషన్) విజేతలను హెచ్హెచ్ సయ్యద్ థెయాజిన్ సత్కరించారు. డిజిటల్ మీడియా, డిజిటల్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, యూత్ అనే ఐదు డొమైన్ల నుండి 21 మంది యువకులను ఎంపిక చేసి అవార్డులను అందజేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









