5 కొత్త బ్రిడ్జిలతో దుబాయ్ ఐకానిక్ ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్
- October 27, 2024
దుబాయ్: దుబాయ్లోని ఐకానిక్ ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్ను ప్రధాన కూడలిగా మార్చేందుకు Dh696 మిలియన్ దిరహం తో ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఐదు కొత్త వంతెనలు నిర్మించబడతాయి. ఈ వంతెనలు మొత్తం 5,000 మీటర్ల పొడవు కలిగి ఉంటాయి. దుబాయ్ రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ట్రాఫిక్ ఆలస్యం సమయం 12 నిమిషాల నుండి కేవలం 90 సెకన్లకు తగ్గుతుందనీ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ట్రాఫిక్ రద్దీ మెరుగుపడటమే కాకుండా ప్రధాన రహదారుల మధ్య అనుసంధానం సులభమవుతుంది.
ఈ ప్రాజెక్ట్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC) మరియు దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) వంటి ముఖ్యమైన ప్రాంతాలకు సేవలు అందిస్తుంది. ఇది దుబాయ్లోని సుమారు 5 లక్షల మంది నివాసితులు మరియు సందర్శకులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
ఈ ప్రాజెక్ట్ దుబాయ్ నగర అభివృద్ధికి మరియు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పవచ్చు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









