యూఏఈ వీసా క్షమాభిక్ష.. దశాబ్దం తర్వాత ఇంటికి వెళుతున్న మహిళ..!!
- October 28, 2024
యూఏఈ: షార్జా నివాసి రబియా బంగ్లాదేశ్లోని తన స్వస్థలాన్ని వదిలినప్పుడు, ఆమె కుమార్తెకు కేవలం తొమ్మిదేళ్లు. తాజాగా రబియా క్షమాభిక్ష పొంది ఇంటికి వెళ్లనుంది. ప్రస్తుతం ఆమె కుమార్తెకు 19 సంవత్సరాలు. రబియా మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా తన కుమార్తే నన్ను తిరిగి రావాలని నిరంతరం ఫోన్లో ఏడుస్తూనే ఉందని చెప్పారు. "నేను నా కూతురిని కౌగిలించుకుని, నా చేతుల్లో ఆమెను తీసుకోని ఏడవాలని పిస్తుంది." ఆమె భావోద్వేగంతో చెప్పింది. తన కుటుంబానికి ఏకైక ఆధారం అయిన రబియా 11 ఏళ్ల క్రితం తొలిసారిగా యూఏఈకి వచ్చింది. అనేక వైద్య సమస్యలు, నొప్పులతో పోరాడుతున్న రబియా.. ప్రస్తుతం రెండు ఇళ్లలో పార్ట్టైమ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.
సెప్టెంబరు 1న యూఏఈ రెండు నెలల సుదీర్ఘ క్షమాభిక్షను ప్రకటించింది. ఇది దేశంలో అక్రమంగా నివసిస్తున్న వేలాది మందికి ఆశలు కల్పించింది. వారు ఇప్పుడు ఎలాంటి పెనాల్టీలు లేకుండా దేశం విడిచి వెళ్లవచ్చు. లేదా వారు ఇక్కడే ఉద్యోగాలు చేయాలనుకుంటే, అర్హతలు ఉన్న వారి వీసాను రెసిడెన్సీ వీసాగా మార్చుకోవచ్చు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







