NEOM సిందాలాహ్.. సౌదీ టూరిజానికి బూస్ట్..ఎర్ర సముద్రానికి విలాసవంతమైన గేట్వే..!!
- October 28, 2024
రియాద్: NEOM లగ్జరీ ఐలాండ్ సిందాలాహ్ ను అధికారికంగా NEOM బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టులను క్రౌన్ ప్రిన్స్, NEOM బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ మొహమ్మద్ బిన్ సల్మాన్ డిసెంబర్ 2022లో ప్రకటించారు. సిందాలాహ్ ప్రారంభోత్సవం NEOM అభివృద్ధిలో ఒక అద్భుతమైన మైలురాయిని సూచిస్తుందని పేర్కొన్నారు. సౌదీ విజన్ 2030 కింద కింగ్డమ్ పర్యాటక ఆశయాలకు అనుగుణంగా వినూత్న గమ్యస్థానాలను అభివృద్ధి చేయడంలో NEOM సామర్థ్యాన్ని సిందాలా మరోసారి నిరూపించింది.
వాయువ్య సౌదీ అరేబియాలోని NEOM తీరప్రాంతానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్ర సముద్రంలో నీలవర్ణంలో ఉన్న సిందాలాహ్ 840,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ద్వీపం ఎర్ర సముద్రానికి NEOM గేట్వేగా పనిచేయనుంది. ఇది యూరోపియన్, సౌదీ, GCC యాచ్ యజమానులకు మరో గమ్యస్థానంగా మారనుంది. ప్రముఖ యాచింగ్ ఆర్కిటెక్చర్ సంస్థ లూకా డిని రూపొందించిన ఈ ద్వీపంలో ప్రపంచ స్థాయి రెస్టారెంట్లు, హోటళ్లు, వేదికలు ఉన్నాయి. 2028 నాటికి ప్రతిరోజూ 2,400 మంది అతిథులను స్వాగతించేలా ఏర్పాటు చేశారు. సిందాలాహ్ సుమారుగా 3,500 ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. సౌదీ విజన్ 2030కి అనుగుణంగా టూరిజం పరిశ్రమలకు మద్దతు ఇస్తుందని NEOM చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నద్మీ అల్-నస్ర్ తెలిపారు. సిందాలాహ్ ఆకట్టుకునే సముద్ర పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందని, ఇక్కడి నీటిలో 1,100 జాతుల చేపలు ఉన్నాయన్నారు. బీచ్ ఫ్రంట్ గోల్ఫ్ క్లబ్ అన్ని నైపుణ్య స్థాయిలకు గోల్ఫ్ అనుభవాన్ని అందిస్తుంది. 88 విల్లాలు, 218 లగ్జరీ సర్వీస్డ్ అపార్ట్మెంట్లను అందుబాటులోకి తేనున్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









