కువైట్ లో డిగ్రీ లేని 60 ఏళ్లు పైబడిన ప్రవాసులకు శుభవార్త..!!
- November 04, 2024
కువైట్: మూడు సంవత్సరాల ఆంక్షలను అమలు చేసిన తర్వాత, కువైట్ ఇప్పుడు యూనివర్సిటీ డిగ్రీ లేకుండా 60 ఏళ్లు పైబడిన ప్రవాస కార్మికుల కోసం నిబంధనలను సడలించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ 60 ఏళ్లు పైబడిన విశ్వవిద్యాలయం లేని ప్రవాసులపై తన నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తోంది. ఈ నిర్ణయం కార్మిక మార్కెట్పై ప్రతికూల ప్రభావితం చూపిందని నివేదికలు అందిన నేపథ్యంలో నిబంధనలను సవరించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఈ కేటగిరీ ప్రజలు తమ రెసిడెన్సీని కొనసాగించడానికి సంవత్సరానికి సుమారు 1000 దినార్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో బీమా ఇతర రుసుములు ఉంటాయి. దీని వల్ల చాలా మంది ప్రత్యేక కార్మికులు 60 సంవత్సరాల తర్వాత దేశం విడిచి వెళ్ళారు. ముఖ్యంగా దశాబ్దాల అనుభవం ఉన్న వేలాది మంది కార్మికులు దేశం విడిచి వెళ్లడం వల్ల ప్రత్యేక వృత్తిపరమైన, సాంకేతిక కార్మికుల కొరత ఏర్పడటంతో ఇది కార్మిక మార్కెట్ను ప్రభావితం చేసింది. ఇటీవల మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి , అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ కార్మిక మార్కెట్లో స్కిల్డ్ లేబర్ సంఖ్యను పెంచడానికి అనేక దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఇందులో ప్రభుత్వ కాంట్రాక్టుల నుండి ప్రవాస ఉద్యోగులను ప్రైవేట్ రంగానికి తరలించడంతోపాటు గృహ కార్మికులను బదిలీ చేయడానికి అనుమతించారు.
తాజా వార్తలు
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!







