వలసలు - అభివృద్ధి కార్యక్రమానికి ముగ్గురు తెలుగు గల్ఫ్ ప్రవాసి కార్మిక నాయకుల ఎంపిక
- July 07, 2015
కార్మిక నాయకులకు సామర్థ్య పెంపుదల కార్యక్రమంలో భాగంగా "వలసలు మరియు అభివృద్ధి: సమస్యలు, ధృక్కోణాలు" అనే అంశంపై డిల్లీ సమీపంలోని నోయిడాలోని వి.వి.గిరి నేషనల్ లేబర్ ఇన్ స్టిట్యూట్ లో ఈనెల 13 నుండి 16 వరకు నాలుగు రోజులపాటు శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు.
కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన గల్ఫ్ ప్రవాసి కార్మిక నాయకులు శ్రీ కడార్ల రంజిత్ కుమార్, కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రవాసి భారతీయ వ్యవహారాల న్యాయ నిపుణులు శ్రీ నాగుల రమేష్, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన ప్రముఖ సంఘ సేవకులు శ్రీ గట్టిం మానిక్యాలరావ్ లకు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా ఆహ్వానం వచ్చింది.
దేశంలోని ప్రముఖ విశ్వ విద్యాలయాలు, పరిశోదనా సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన నిపుణులు వీరికి శిక్షణ ఇస్తారు. ఉపన్యాసాలు, సంప్రదింపులు, చర్చలు, అధ్యయనాల ఉదాహరణల విధానంలో భోధన ఉంటుంది. వలస మరియు అభివృద్ధి మధ్య సంబంధాల అవగాహన పెంచే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వలసల పరిశోధన, విధానపరమైన అంశాలలో ఉద్భవించే సమస్యలను అధిగమించడానికి పరిశోధకులు మరియు విధాన నిర్ణేతలు సామర్థ్యాలను అభివృద్ధి చేస్తారు. వలసలకు సంబంధించిన భావాలు మరియు సిద్ధాంతాలు అర్థం చేసుకోవడం, ప్రపంచీకరణ ఆర్ధికవ్యవస్థలో వలసలపై పోకడలు మరియు నమూనాలు పరిశీలించడం, సమకాలీన వలస విధానాలను చర్చించడం, వలసలకు అభివృద్ధికి గల సంభావ్యతను విశ్లేషించడం జరుగుతుంది.
మంద భీంరెడ్డి('మా గల్ఫ్' ప్రతినిధి, హైదరాబాద్)
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









