భారతీయ కమ్యూనిటీ సభ్యులకు 'వ్యక్తుల అక్రమ రవాణా'పై అవగాహన..!
- November 18, 2024
బహ్రెయిన్: బహ్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం, బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ (IOM) సహకారంతో భారతీయ కమ్యూనిటీ సభ్యులకు 'వ్యక్తుల అక్రమ రవాణా' అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించింది. ఎంబసీ ప్రాంగణంలో లేబర్ మార్కెట్ కు సంబంధించిన అంశాలపై బహ్రెయిన్ ప్రభుత్వం అవగాహన కల్పించారు. 'వర్కింగ్ టుగెదర్' కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ భారతీయ సంఘాలు, ప్రైవేట్ కంపెనీలు, మ్యాన్పవర్ ఏజెన్సీల ప్రతినిధులతో సహా భారతీయ కమ్యూనిటీ సభ్యులు హాజరయ్యారు. రాయబారి HE Mr. వినోద్ K. జాకబ్ మాట్లాడుతూ.. బహ్రెయిన్లోని భారతీయ ప్రవాసులు ఆతిథ్య ప్రభుత్వ చట్టాలు, నియమాలు, నిబంధనలను అనుసరించాలని, అదే సమయంలో స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా భారతీయ సమాజ ప్రయోజనాలను పరిరక్షించినందుకు LMRAతో సహా బహ్రెయిన్ ప్రభుత్వానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









