భారతీయ కమ్యూనిటీ సభ్యులకు 'వ్యక్తుల అక్రమ రవాణా'పై అవగాహన..!
- November 18, 2024
బహ్రెయిన్: బహ్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం, బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ (IOM) సహకారంతో భారతీయ కమ్యూనిటీ సభ్యులకు 'వ్యక్తుల అక్రమ రవాణా' అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించింది. ఎంబసీ ప్రాంగణంలో లేబర్ మార్కెట్ కు సంబంధించిన అంశాలపై బహ్రెయిన్ ప్రభుత్వం అవగాహన కల్పించారు. 'వర్కింగ్ టుగెదర్' కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ భారతీయ సంఘాలు, ప్రైవేట్ కంపెనీలు, మ్యాన్పవర్ ఏజెన్సీల ప్రతినిధులతో సహా భారతీయ కమ్యూనిటీ సభ్యులు హాజరయ్యారు. రాయబారి HE Mr. వినోద్ K. జాకబ్ మాట్లాడుతూ.. బహ్రెయిన్లోని భారతీయ ప్రవాసులు ఆతిథ్య ప్రభుత్వ చట్టాలు, నియమాలు, నిబంధనలను అనుసరించాలని, అదే సమయంలో స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా భారతీయ సమాజ ప్రయోజనాలను పరిరక్షించినందుకు LMRAతో సహా బహ్రెయిన్ ప్రభుత్వానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







