భారతీయ కమ్యూనిటీ సభ్యులకు 'వ్యక్తుల అక్రమ రవాణా'పై అవగాహన..!
- November 18, 2024
బహ్రెయిన్: బహ్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం, బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ (IOM) సహకారంతో భారతీయ కమ్యూనిటీ సభ్యులకు 'వ్యక్తుల అక్రమ రవాణా' అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించింది. ఎంబసీ ప్రాంగణంలో లేబర్ మార్కెట్ కు సంబంధించిన అంశాలపై బహ్రెయిన్ ప్రభుత్వం అవగాహన కల్పించారు. 'వర్కింగ్ టుగెదర్' కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ భారతీయ సంఘాలు, ప్రైవేట్ కంపెనీలు, మ్యాన్పవర్ ఏజెన్సీల ప్రతినిధులతో సహా భారతీయ కమ్యూనిటీ సభ్యులు హాజరయ్యారు. రాయబారి HE Mr. వినోద్ K. జాకబ్ మాట్లాడుతూ.. బహ్రెయిన్లోని భారతీయ ప్రవాసులు ఆతిథ్య ప్రభుత్వ చట్టాలు, నియమాలు, నిబంధనలను అనుసరించాలని, అదే సమయంలో స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా భారతీయ సమాజ ప్రయోజనాలను పరిరక్షించినందుకు LMRAతో సహా బహ్రెయిన్ ప్రభుత్వానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









