ఎమిర్ని అవమానిస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు
- June 25, 2016
కువైట్, ఎలక్టోరల్ చట్టానికి కొత్త సవరణ చేసింది. ఈ చట్ట సవరణతో ఎమిర్ని అవమానించేలా వ్యాఖ్యానించేవారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. బుధవారం పార్లమెంటు ఈ చట్ట సవరణను ఆమోదించింది. గాడ్, ప్రొఫెట్స్, ఎమిర్ తదితరుల్ని అవమానించేలా వ్యాఖ్యానించేవారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా ఎలక్టోరల్ చట్టానికి సవరణ తీసుకువచ్చారు. ఈ సవరణ ద్వారా మాజీ ఎంపి ముసల్లమ్ అల్ బర్రాక్కి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. 2012లో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకుగాను జైలుపాలయ్యారు. కువైట్, సహచర దేశాలతో పోల్చితే వాక్ స్వాతంత్రాన్ని బాగానే కల్పించినా, రాజ్యాంగం ప్రకారం ఎమిర్కి ప్రత్యేక గౌరవాలున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమిర్ని అవమానించేవారికి ఐదేళ్ళ వరకు జైలు శిక్ష తప్పదు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









