రమదాన్ అలర్ట్: డయాబెటిక్ పిల్లలకు హెచ్ఎంసి సూచనలు
- June 25, 2016
పవిత్ర రమదాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేస్తుంటారు. వీరిలో పిల్లలు కూడా ఉంటారు. అయితే డయాబెటిస్తో బాధపడుతున్నవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఉపవాసం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. పిల్లల్లోనూ, వృద్ధుల్లోనూ డయాబెటిస్ కారణంగా ఉపవాసం ప్రమాదకరంగా మారుతుంది. హమాద్ మెడికల్ కార్పొరేషన్, డయాబెటిక్ పిల్లలకు కొన్ని సూచనలు చేసింది. ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో వారి సూచన మేరకు ఫాస్టింగ్ చేయడం పిల్లలకు ఉత్తమమని హెచ్ఎంసి వర్గాలు వివరించాయి. బ్లడ్ షుగర్ లెవల్స్లో హెచ్చు తగ్గుల్ని బట్టి, వారికి మందుల్ని డాక్టర్లు సూచించగలుగుతారనీ, ట్యాబ్లెట్లు వాడేవారికి ఒక విధంగా, ఇన్సులిన్ని వాడేవారికి ఇంకొకలా ఫాస్టింగ్ సూచనలుంటాయని హెచ్ఎంసి వర్గాలు తెలిపాయి. డాక్టర్ జయ్యోసి మాట్లాడుతూ, డయాబెటిక్ పిల్లలు గ్లుకాగోన్ లేదా గ్లూకోజ్ ఇంజెక్షన్ని ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. అలాగే ఫాస్టింగ్ పూర్తి చేసిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, స్వీట్స్ని దూరంగా ఉంచడం ద్వారా రమదాన్ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









