సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

- November 21, 2024 , by Maagulf
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీ.ఆర్. నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన బీఆర్ నాయుడు.. సీఎంను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాన్ని అందజేశారు.శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలపై కొద్దిసేపు చర్చ జరిగింది.

తిరుమల ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. తిరుమలలో స్వామివారి దర్శనం విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతి ఇవ్వకపోవడం పై కొంతకాలంగా తెలంగాణ నేతల నుంచి అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, బీఆర్ నాయుడు భేటీతో ఈ విషయం పై పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com