కువైట్‌లో "మోడైలాగ్" పుస్తకాన్ని ఆవిష్కరించిన స్మృతి ఇరానీ

- November 23, 2024 , by Maagulf
కువైట్‌లో \

కువైట్: కువైట్‌లో డాక్టర్ అశ్విన్ ఫెర్నాండెజ్ రచించిన "మోడైలాగ్: కన్వర్సేషన్స్ ఫర్ ఎ విక్షిత్ భారత్" పుస్తకాన్ని భారత మాజీ కేంద్ర మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ ఆవిష్కరించారు. రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కువైట్‌లోని భారత రాయబారి హెచ్‌ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా, పుస్తక రచయిత డాక్టర్ అశ్విన్ ఫెర్నాండెజ్ లతోపాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.  ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ సందర్భంగా కువైట్ గురించి ప్రస్తావించినందుకు తాను సంతోషిస్తున్నట్టు రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా చెప్పారు. మోదీలాగ్ ద్వారా డాక్టర్ అశ్విన్ ఫెర్నాండెజ్ మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పంచుకున్న కథనాల సారాంశాన్ని అందించారని స్మృతి ఇరానీ అన్నారు.  ఈ పుస్తకంలో 4,200 మందికి పైగా వ్యక్తుల నుండి వచ్చిన ప్రతిస్పందనలతో ప్రజలపై మన్ కీ బాత్ చూపెట్టిన సానుకూల ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com