పెర్త్ టెస్టులో భారత్ ఘన విజయం
- November 25, 2024
ఆస్ట్రేలియా: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. 534 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా 238 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియా 295 రన్స్ తేడాతో గెలిచింది. ఓవర్నైట్ స్కోర్ 12/3తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ మరో ఐదు పరుగులు జోడించి ఉస్మాన్ ఖవాజా వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ద్వయం కొద్దిసేపు భారత బౌలర్లను నిలువరించింది. ఐదో వికెట్కు ఈ జోడి 62 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. అయితే, మహ్మద్ సిరాజ్ ఓ అద్భుతమైన బంతితో స్మిత్ను బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలోనే ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్తో కలిసి స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. 89 పరుగులు చేసి సెంచరీ వైపు దూసుకెళ్తున్న హెడ్ను బుమ్రా పెవిలియన్కు పంపాడు. దీంతో మార్ష్, హెడ్ నెలకొల్పిన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం స్వల్ప వ్యవధిలోనే మిచెల్ మార్ష్ (47), మిచెల్ స్టార్క్ (12) వికెట్లను కోల్పోవడంతో ఆసీస్ ఓటమి ఖాయమైంది. చివరికి ఆతిథ్య జట్టు 58.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లు తీశారు. అలాగే వాషింగ్టన్ సుందర్ 2, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు. రెండు ఇన్నింగ్స్లలో కలిపి 8 వికెట్లతో (మొదటి ఇన్నింగ్స్ లో 5, రెండో ఇన్నింగ్స్లో 3) రాణించిన కెప్టెన్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. కాగా, ఈ విజయంతో ఐదు మ్యాచుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ 0-1తో లీడ్లోకి దూసుకెళ్లింది. ఇక రెండో టెస్టు వచ్చే నెల 6 నుంచి 10వ తేదీ మధ్య అడిలైడ్లో జరగనుంది. భారత్ తొలి ఇన్నింగ్స్: 150, రెండో ఇన్నింగ్స్: 487/6 డిక్లేర్ ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 104, రెండో ఇన్నింగ్స్: 238
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







