ఆపరేషన్ టాలెంట్..750 మిలియన్ దిర్హామ్ల బడ్జెట్కు షేక్ హమ్దాన్ ఆమోదం..!!
- November 29, 2024
దుబాయ్: 2033 నాటికి ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా దుబాయ్ ఎమిరేట్ను స్థాపించే లక్ష్యంతో దుబాయ్ పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ కార్యక్రమం తదుపరి దశ కోసం దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ 750 మిలియన్ల బడ్జెట్ను ఆమోదించారు. దుబాయ్ ప్రభుత్వం ఆవిష్కరణ, అభివృద్ధి, సుస్థిరత, స్థితిస్థాపకత, భవిష్యత్తు సంసిద్ధత కోసం గ్లోబల్ హబ్గా ఎమిరేట్ హోదాను బలోపేతం చేయడం కొనసాగిస్తోందన్నారు. దుబాయ్ నాలెడ్జ్-ఆధారిత, సాంకేతికత-ఆధారిత ఆర్థిక వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడానికి, ప్రపంచ పోటీతత్వాన్ని పెంచడానికి Dh750 మిలియన్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి ప్రతిభావంతులకు గమ్యస్థానంగా దుబాయ్ని తీర్చిదిద్దబోతున్నామని షేక్ హమ్దాన్ అన్నారు.
దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ పర్యవేక్షిస్తున్న దుబాయ్ రీసెర్చ్, డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్.. కొత్త ఆవిష్కరణలతో దుబాయ్ని ప్రముఖ గ్లోబల్ హబ్గా నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది. 2033 నాటికి దుబాయ్ జీడీపికి సంవత్సరానికి 20 బిలియన్ దిర్హామ్లను అందించడం, 120,000 కొత్త ఉద్యోగాలను సృష్టించడం, 600 వినూత్న స్టార్టప్ల స్థాపనకు మద్దతు ఇవ్వడం ఇది లక్ష్యంగా పెట్టుకుంది. మూడు సంవత్సరాలలో 750 మిలియన్ల నిధులతో ఈ కార్యక్రమం ప్రపంచ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల భాగస్వామ్యంతో పనిచేయనుంది.
తాజా వార్తలు
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!







