భార్యకు బంగారు గొలుసు కొంటే లక్కీగా 8 కోట్లు వరించిన అదృష్టం
- November 30, 2024
అదృష్టం అంటే ఇతడిదే.. ఎందుకంటే సింగపూర్లో ఒక ప్రవాస భారతీయుడు భార్య కోసం బంగారు గొలుసు కొంటే ఏకంగా లక్కీ డ్రాలో రూ.8 కోట్లు గెలుచుకున్నాడు.ఇది కదా అదృష్టం అంటే.ఇంతకీ ఈ అదృష్టవంతుడు ఎవరో డీటెయిల్ గా తెలుసుకుందాం.
సింగపూర్లో భారతీయ సంతతికి చెందిన బాలసుబ్రమణ్యం చిదంబరం అనే వ్యక్తి తన భార్య కోసం స్థానికంగా ఉన్న ముస్తఫా జ్యువెలరీ షాపులో మూడు నెలల క్రితం 6000 డాలర్ల విలువైన బంగారు గొలుసు కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసే సమయంలో 250 డాలర్ల కన్నా ఎక్కువ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి ఆ జ్యూవెలరీ షాపు లక్కీ డ్రా కు అర్హత ఉంది.
మొదట లక్కీ డ్రా గురించి అంతగా ఆసక్తి చూపని చిదంబరం తరువాత 'ఏమో గుర్రం ఎగరావచ్చు' అని అనుకుని డ్రా కుపన్ నింపి తను కొనుగోలు చేసిన బంగారముతో ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు జరిగిన జ్యువెలరీ వార్షిక కార్యక్రమంలో లక్కీ డ్రా నిర్వహించారు.ఈ లక్కీ డ్రాలో చిదంబరం ఏకంగా 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ (రూ. 8 కోట్లు) గెలుచుకున్నాడు.
అది కూడా తన నాన్న వర్ధంతి రోజున ఈ లక్కీ డ్రా తనను వరించడంతో చిదంబరం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈ శుభవార్త తన తల్లితో పంచుకోనీ ఆనంద పారవశ్యం చెందిన చిదంబరం గెలిచిన దాంట్లో కొంత భాగాన్ని సమాజానికి విరాళంగా ఇస్తున్నానని తన తల్లితో చెప్పి ఈ విధంగా నాన్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







