చెన్నై విమానాశ్రయంలో ఇండిగో విమానంకు తృటిలో తప్పిన ప్రమాదం..
- December 01, 2024
చెన్నై: చెన్నై విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగాల్ తుఫాన్ కారణంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.చెన్నైలోనూ ఎడతెరిపిలేని వర్షం కురవడంతో విమానాశ్రయంలోసైతం నీరు చేరింది. రన్వే పైకి వర్షపు నీరు రావడంతో విమానాలు దిగేందుకు, ఎగిరేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
విమానాశ్రయం రన్వేపై వర్షపు నీరు ఉన్న సమయంలో ఇండిగో ఎయిర్లైన్స్ ఎయిర్బస్ విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించింది. ల్యాండింగ్ అయ్యే క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో అప్రమత్తమైన పైలెట్ తిరిగి విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లాడు. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలాఉంటే.. భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయంలో నీరు చేరడంతో శనివారం తాత్కాలికంగా విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఆదివారం తెల్లవారు జామునుంచి విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో ఇండిగో ఎయిర్ లైన్స్ ఆదివారం ఉదయం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







