ఆరోగ్య సమస్యల నుంచి దూరం కావాలంటే... ఖర్జూరాన్ని ఇలా తినండి
- December 02, 2024చలికాలం ప్రారంభమైంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇప్పటికే చలిగాలులు తీవ్రంగా ఉన్నాయి. చలిగాలులు, పొడి వాతావరణం కారణంగా చాలా మంది రోగాల బారిన పడే ప్రమాదముంది. చలికాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి అనే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే చలికాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తినే ఆహారంపై. ఈ సీజన్లో ఏది పడితే అది తింటే అనారోగ్యమే. అందుకే శీతాకాలంలో వచ్చే సీజన్లో వ్యాధుల్ని తట్టుకోవాలంటే కొన్ని ప్రత్యేక ఆహారాల్ని తినాలి.
ఈ రోజుల్లో చాలా మంది డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. అయితే, చలికాలంలో ఖర్జూరాన్ని తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, చాలా మంది ఖర్జూరాన్ని తింటున్నప్పటికీ.. వారికి తినే పద్దతి తెలియడం లేదు. ఖర్జూరాన్ని ఎలా, ఎప్పుడు తింటే ఆరోగ్యానికి మంచి జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
ఖర్జూరం తినడానికి చాలా రుచిగా ఉంటాయి. అందుకే వీటిని చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇవి ఆర్థరైటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరంలో విటమిన్లు, పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఎముకలను దృఢంగా మార్చడంతోపాటు కీళ్లనొప్పులు వంటి వ్యాధుల నుంచి కాపాడతాయి. చలికాలంలో ఖర్జూరం తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో మీకు బలం వస్తుంది. అంతేకాకుండా అలసట, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
1. ఖర్జూరం తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది. ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఐరన్ లోపం ఉన్నవారి ఖర్జూరాల్ని తినవచ్చు.
2. అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్యలతో బాధపడేవారికి ఖర్జూరం ఓ వరం. ఖర్జూరాలు రోజూ తినడం వల్ల కొవ్వు, రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి.
3. ప్రొస్టేట్ గ్రంథి సమస్య, యూరీనరీ సమస్యలతో బాధపడేవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు రోజూ ఖర్జూరాలు తింటే మంచి ఫలితాలుంటాయి.
4.ఖర్జూరాల్లో ఫైబర్, మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. మలబద్ధక సమస్యతో బాధపడేవారు ఖర్జూరాలు తింటే వారికి రిలీఫ్ లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
5. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఖర్జూరాలు తినాలి. ఖర్జూరాలు తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
ఖర్జూరాలు ఎప్పుడు పడితే అప్పుడు తింటే శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు అందవు. ఖర్జూరాన్ని రోజూ ఖాళీకడుపుతో తింటే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. లేదంటే బ్రేక్ఫాస్ట్లో ఖర్జూరాన్ని తినవచ్చు. బరువు పెరగాలనుకునేవారు రాత్రి పూట నెయ్యితో కలిపి తింటే మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.
అదే, రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాలనుకుంటే కేవలం రెండు మాత్రమే తింటే సరిపోతుంది. ఉదయాన్నే అల్పహారం తర్వాత కూడా రెండు తింటే మంచి ఫలితాలుంటాయి. అయితే, లావు తక్కువ ఉండి.. బరువు పెరగాలనుకునేవారు రోజూ నాలుగు తినాలని నిపుణులు చెబుతున్నారు.
ఖర్జూరాల్ని డైరెక్ట్గా తినవచ్చు. లేదంటే మిల్క్ షేక్, స్మూతీల్లా చేసుకుని తీసుకోవచ్చు. అయితే, శరీరానికి ఎక్కువ ప్రయోజనాలు అందాలంటే మాత్రం ఖర్జూరాల్ని నానబెట్టి తినడం మంచిది. ఖర్జూరాల్ని నానబెట్టడం ద్వారా అందులో ఉండే టానిన్లు, ఫైటిక్ యాసిడ్ తొలగిపోతాయి. అంతేకాకుండా నానబెట్టిన ఖర్జూరాలు సులభంగా జీర్ణమవుతాయి. రాత్రంతా ఖర్జూరాల్ని నానబెట్టి.. ఉదయాన్నే తింటే బోలెడు లాభాలు ఉంటాయి. పాలతో ఉడికించి తినడం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో విప్రో విస్తరణ
- ముహరఖ్ లో జాతీయ స్టేడియం..ఎంపీల ప్రతిపాదన..!!
- ఎన్విజన్ సిఇఓ లీ జంగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
- డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ మాట్లాడుతున్నారా?
- మనీ ఎక్స్ఛేంజ్లో సాయుధ దోపిడీ..24 గంటల్లో నైజీరియన్ ముఠా అరెస్ట్..!!
- GCC స్థాయిలో మెటర్నిటీ లీవ్స్ రెగ్యులేషన్స్ పై వర్క్ షాప్..!!
- సౌక్ వాకిఫ్ ఈక్వెస్ట్రియన్ ఫెస్టివల్ 2025 సక్సెస్..!!
- దుబాయ్ లో టాక్సీ కంటే చౌకైనది.. బస్సు కంటే వేగవంతం..!!
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం