మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతికి కారణమైన డ్రైవర్ కు జైలుశిక్ష
- December 04, 2024
మనామా: మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన కేసులో ఒక ఆసియా వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబంలోని ఒకరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. దిగువ క్రిమినల్ కోర్టు విధించిన శిక్షను కాసేషన్ కోర్ట్ సమర్థించింది.
డిసెంబరు 22, 2023న నిందితుడు మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. తన వాహనంపై నియంత్రణ కోల్పోయి, లైట్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో ఒక ప్రయాణికుడు మరణించాడు. కుటుంబ సభ్యులలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
పబ్లిక్ ప్రాసిక్యూషన్.. మద్యం తాగి వాహనం నడపడం, తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల అజాగ్రత్తగా మరణానికి కారణమైనట్లు నిందితుడిపై అభియోగాలు మోపింది. ప్రాసిక్యూషన్ కూడా మద్యం మత్తులో నిందితుడి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రాణ నష్టం సంభవించిందని పేర్కొంది.
దిగువ క్రిమినల్ కోర్ట్ మొదట నిందితుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అతని శిక్ష పూర్తయిన తర్వాత అతనిని బహ్రెయిన్ నుండి శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది. ఆ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేసారు. కానీ అక్కడ కూడా కోర్టు నిందితుడి శిక్షను సమర్థించింది. ఆ తర్వాత కోర్టు ఆఫ్ కాసేషన్లో అప్పీల్ దాఖలు చేయగా, అక్కడ కూడా నిందితుడికి ఉపశమనం లభించలేదు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







