డిస్నీల్యాండ్ను ఓడించిన అబుదాబికి చెందిన యాస్ ఐలాండ్..!!
- December 07, 2024
యూఏఈ: కాలిఫోర్నియాలోని డిస్నీల్యాండ్లోని రెండు థీమ్ పార్క్ల కంటే అబుదాబి యాస్ ద్వీపం గత సంవత్సరం ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించింది. ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం.. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే రెండవ థీమ్ పార్క్ గా నిలించింది. యాస్ ఐలాండ్ గత సంవత్సరం 34 మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు. ఈ మేరకు అరేబియన్ ట్రావెల్ మార్కెట్లో దీని ఆపరేటర్ మిరల్ ప్రకటించింది. 1955లో ప్రారంభమైన డిస్నీల్యాండ్, కాలిఫోర్నియా అడ్వెంచర్ థీమ్ పార్కులు 27.3 మిలియన్ల మంది అతిథులను స్వాగతించినట్టు థీమ్డ్ ఎంటర్టైన్మెంట్ అసోసియేషన్ (TEA) వెల్లడించింది. యాస్ ద్వీపం మొత్తం సందర్శకుల సంఖ్య మునుపటి సంవత్సరంతో పోలిస్తే 38 శాతం పెరిగిందని మిరల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ అల్ జాబీ తెలిపారు. 2010లో ప్రారంభమైన ఈ పార్కులో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రోలర్ కోస్టర్, ఫార్ములా రోస్సా, అధిక-ఆక్టేన్ రైడ్లను పొందేందుకు సందర్శకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారని పేర్కొన్నారు. ఇక యాస్ కంటే ముందున్న ఓర్లాండో వాల్ట్ డిస్నీ వరల్డ్ కాంప్లెక్స్ నాలుగు థీమ్ పార్క్లు గత సంవత్సరం మొత్తం 48.8 మిలియన్ల సందర్శకులను ఆకర్షించాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







