యూఏఈ-ఇండియా ట్రావెల్..విమానాలు పెరగకపోతే 'ధరలు పెరుగుతూనే ఉంటాయి'..!!
- December 07, 2024
యూఏఈ: ఇండియా-యూఏఈ మధ్య ప్రయాణానికి విపరీతమైన డిమాండ్ ఉందని, రెండు దేశాల మధ్య నడిచే విమానాల సంఖ్యను పెంచాలని, లేదంటే విమాన ఛార్జీలు పెరుగుతూనే ఉంటాయని ఇండియాలోని యూఏఈ రాయబారి అబ్దుల్నాసర్ అల్షాలీ అన్నారు. శుక్రవారం DIFCలో ప్రారంభమైన యూఏఈ-ఇండియా ఫౌండర్స్ రిట్రీట్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రెండు దేశాల మధ్య మెరుగైన రవాణా సంబంధాలతో ద్వైపాక్షిక సంబంధాలు బలపడతాయని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులను పెంచడంతోపాటు మరిన్ని టైర్ 2 భారతీయ నగరాలను యూఏఈకి అనుసంధానం చేయాలని కోరారు. తద్వారా పర్యాటకం పెరగడంతోపాటు వ్యాపార అవకాశాలు పెరిగి కొత్గగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 80 బిలియన్ డాలర్లు దాటిందన్నారు. CEPA నుండి మొత్తం మీద 15 శాతం పెరిగింది. పండ్లు, కూరగాయలతో సహా ఫార్మాస్యూటికల్, వ్యవసాయ రంగాలు 30 శాతానికి పైగా వృద్ధిని సాధించాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 60 మంది భారతీయ స్టార్టప్ల వ్యవస్థాపకులు, యూఏఈ వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ఢిల్లీలోని యూఏఈ రాయబార కార్యాలయం, యూఏఈ-ఇండియా సిఇపిఎ కౌన్సిల్ (యుఐసిసి) ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









