12 ఏళ్ళ చిన్నారికి నూతన జీవితాన్ని అందించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- December 13, 2024
హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 12 ఏళ్ల అక్షర తరగతిలో నిద్రపోవడం గమనించిన టీచర్లు మొదట చిన్న పాప అన్నం తినడం వల్ల నిద్రవస్తుందేమో అని అనుకున్నారు. కానీ అలా తరుచు నిద్రపోవడం గమనించిన టీచర్లు ఆమె తల్లిదండ్రులకు ఈ విషయాన్నీ తెలియచేసి వెంటనే డాక్టర్ను సంప్రదించమని సూచించారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పలు వైద్యులను సంప్రదించగా, అక్షరకు మెదడులో మెడులోబ్లాస్టోమా అనే మెదడు ట్యూమర్ ఉన్నట్టు తెలిసింది, ఇది బ్రెయిన్స్టెమ్ను ఒత్తిడి చేస్తూ నరాలకు అతుక్కొని ఉన్నది అని గుర్తిచడం జరిగింది. ట్యూమర్ స్థానం క్లిష్టమైనదిగా ఉండటం వల్ల, ఆపరేషన్లో పక్షవాతం లేదా ప్రాణాపాయం వంటి సమస్యలు రావచ్చని వయసు రీత్యా చిన్న పాపా అవ్వడం చేయటానికి కూడా ముందుకు రాలేక పోయారు.
అటువంటి సమయంలో, అక్షర కుటుంబం సీనియర్ కన్సల్టెంట్ న్యూరో & స్పైన్ సర్జన్ డా. శ్రీకాంత్ రెడ్డిని సంప్రదించారు.పరిస్థితిని పూర్తిగా విశ్లేషించిన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఆపరేషన్ చేసి మొదట ట్యూమర్ గడ్డని తొలగించడం పాప ప్రాణాలను కాపాడటం జరిగింది.ట్యూమర్ను పూర్తిగా తొలగించగలిగారు, కానీ ఆపరేషన్ తరువాత అక్షర హైడ్రోసెఫలస్ అనే సమస్యకు గురైంది, దీనిని సరిచేయడానికి వెంట్రికులోపెరిటోనియల్ (వీపీ) షంట్ కోసం రెండవ సర్జరీ చేయాల్సి వచ్చింది. క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, అక్షర మూడు నెలలపాటు కోమాలోకి వెళ్లింది. ఈ కఠిన పరిస్థితుల్లో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మరియు ఆయన బృందం నిరంతర చికిత్స అందించారు. ఒక రాత్రి, అక్షర ఆకస్మాత్తుగా మేల్కొని తన తండ్రితో మాట్లాడింది, ఇది ఆమె కోలుకోవడంలో ముఖ్యమైన ఘట్టమైంది. ఆ తర్వాత తీసిన స్కాన్లు ఆమె పూర్తిగా కోలుకున్నదని నిర్ధారించాయి.
అనంతరం డాక్టర్ మాట్లాడుతూ అత్యంత క్లిష్టమైన ప్రేదేశంలో చిన్న మెదడుకు ట్యూమర్ వత్తుకొంటూ అతుక్కొని ఉండటం సర్జరీ చాల ఖచ్చితత్వంతో చేయడం మరియు పాప సరైన సమయంలో రావడం వల్ల ప్రాణాలతో బైట పడింది అని అన్నారు.
తమ కూతురి ప్రాణాలను కాపాడినందుకు మరియు కుటుంబంలో సంతోషాన్ని పునరుద్ధరించినందుకు అక్షర కుటుంబం డాక్టర్ శ్రీకాంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసి ఆయనను సన్మానించడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ నిత్య పాలపాటి, అనస్థీషియాలజిస్ట్ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది.
తాజా వార్తలు
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ను భుజపట్టిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్







