గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్‌లో BD 26,000 జరిమానాలు..!!

- December 13, 2024 , by Maagulf
గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్‌లో BD 26,000 జరిమానాలు..!!

మనామా: ట్రావెల్ టికెట్ స్కామ్ లో నిందితులకు భారీ జరిమానా విధించారు.  విదేశాలకు బంగారం తరలించిన నగల దుకాణం యజమాని, ముగ్గురు వ్యక్తులకు క్రిమినల్ కోర్టు మొత్తం BD 26,000 జరిమానా విధించింది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది.

దుకాణ యజమానికి BD 10,000 జరిమానా విధించగా, అతని ఇద్దరు సహచరులకు కలిపి BD 15,000 జరిమానా విధించారు. నాల్గవ నిందితుడికి బిడి 1,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నిందితులపై మనీలాండరింగ్,  లైసెన్స్ లేని వ్యాపారం చేస్తున్నట్లు కేసులు నమోదు చేశారు. అనంతరం షాపులోని బంగారు నగలతోపాటు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ నేషనల్ సెంటర్ (FINC) జరిపిన విచారణతో స్మగ్లింగ్ రాకెట్‌ బయటపడింది. దుకాణం యజమాని నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా బంగారు ఆభరణాలను విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com