తెలుగు రాష్ట్రాలు ‘గజగజ’

- December 15, 2024 , by Maagulf
తెలుగు రాష్ట్రాలు ‘గజగజ’

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ప్రజలను గజగజ వణికిస్తోంది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రంగా నమోదవుతోంది. బేల ప్రాంతంలో 6.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడం చలికి అద్దంపడింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కుంతలంలో 8.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇతర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. చలి తీవ్రత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి వేళల్లో చలి తీవ్రంగా ఉండటంతో బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా ప్రజలు గృహాల్లోనే తలదాచుకుంటున్నారు. పొలాల్లో పని చేసే రైతులు, నిర్మాణ కార్మికులు, ఇతర శ్రామిక వర్గాలు ఈ చలితో బాగా ఇబ్బంది పడుతున్నారు.

ఇక రాబోయే రోజుల్లో చలి తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో, తెలుగురాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయని అంచనా. అయితే, రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చలి ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి హడావుడి సన్నగిల్లింది. ప్రజలు కాఫీ, టీ లాంటి తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. వెచ్చని బట్టలు, దుబ్బట్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. రోడ్లపై తెల్లవారుజామున మంచు తరచుగా కనిపిస్తూ, వాహనదారులకు సమస్యలు కలిగిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com