ప్రధాని మోదీ కమ్యూనిటీ కార్యక్రమానికి సన్నాహాలు పూర్తి..!!
- December 21, 2024
కువైట్: భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కువైట్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా శనివారం భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కువైట్లోని సబా అల్ సేలం ప్రాంతంలోని షేక్ సాద్ అల్ అబ్దుల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ప్రధాని మోదీ 'హలా మోదీ' కమ్యూనిటీ ఈవెంట్కు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 4,000 నుండి 5,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది.
కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు కువైట్కు తన రెండు రోజుల అధికారిక పర్యటనలో కమ్యూనిటీ కార్యక్రమంలో భాగంగా భారతీయ ప్రవాసులతో మాట్లాడతారు.అనంతరం కార్మిక శిబిరాన్ని కూడా సందర్శిస్తారు. 43 సంవత్సరాలలో ఒక భారత ప్రధాని కువైట్ సందర్శించడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







