ప్రధాని మోదీ కమ్యూనిటీ కార్యక్రమానికి సన్నాహాలు పూర్తి..!!
- December 21, 2024
కువైట్: భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కువైట్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా శనివారం భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కువైట్లోని సబా అల్ సేలం ప్రాంతంలోని షేక్ సాద్ అల్ అబ్దుల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ప్రధాని మోదీ 'హలా మోదీ' కమ్యూనిటీ ఈవెంట్కు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 4,000 నుండి 5,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది.
కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు కువైట్కు తన రెండు రోజుల అధికారిక పర్యటనలో కమ్యూనిటీ కార్యక్రమంలో భాగంగా భారతీయ ప్రవాసులతో మాట్లాడతారు.అనంతరం కార్మిక శిబిరాన్ని కూడా సందర్శిస్తారు. 43 సంవత్సరాలలో ఒక భారత ప్రధాని కువైట్ సందర్శించడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









