మహిళ కారుపై ' అభ్యంతరకరమైన' నోట్..యువకుడికి 1,000 దిర్హామ్ల జరిమానా..!!
- December 29, 2024
యూఏఈ: పబ్లిక్ డీసెన్సీ యాక్ట్ ను ఉల్లంఘించినందుకు దోషిగా తేలిన తర్వాత 19 ఏళ్ల ఎమిరాటికి 1,000 దిర్హామ్ల జరిమానా విధించారు. పోర్ట్ రషీద్ ప్రాంతంలోని కేఫ్ సమీపంలోని పబ్లిక్ పార్కింగ్ స్థలంలో జరిగిన ఈ సంఘటనలో యువకుడు ఒక మహిళ కారుపై అభ్యంతరకరమైన చేతిరాతతో రాసిన నోట్ను పెట్టాడు. అందులో అభ్యంతరకరమై, అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ సంఘటన నవంబర్ 10, 2023న జరిగింది. నోట్ను గుర్తించిన వెంటనే, భర్త దానిని ఫోటో తీసి తన భార్యకు పంపాడు. ఆమె వెంటనే సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారులు విచారణ చేపట్టి, సీసీ ఫుటేజీని పరిశీలించి యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తనకు కారు ఓనర్ ఎవరో తెలియదని, ఆమెతో ఎలాంటి ముందస్తు పరిచయం లేదని, సరదాగా రాసినట్లు విచారణలో నిందితుడు తన తప్పును ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







