పబ్లిక్ రోడ్ను బ్లాక్ చేస్తే..గరిష్ఠంగా SR100000 జరిమానా..!!
- December 29, 2024
రియాద్: పబ్లిక్ ఫెసిలిటీస్ రక్షణ నిబంధనల ప్రకారం.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పబ్లిక్ రోడ్డు లేదా వరద డ్రైనేజీ మార్గాలను దెబ్బతీయడం, బ్లాక్ చేయడం చేస్తే దెబ్బతిన్న ప్రాంతాన్ని మరమ్మతు చేయడానికి అయ్యే ఖర్చులో 75 శాతం జరిమానా (SR100000 వరకు) విధించబడుతుంది. ఈ మేరకు మునిసిపాలిటీలు, హౌసింగ్ మంత్రి మాజిద్ అల్-హోగైల్ నిబంధనలను ఆమోదించారు. అదే విధంగా డ్రైనేజీ మార్గాలను దెబ్బతీస్తే మరమ్మతులతోపాటు 10 శాతం జరిమానా(SR100000 మించకుండా) విధిస్తారు. రోడ్లపై వాహనాలను కడిగితే, SR3000 జరిమానా విధిస్తారు.
నీరు లేదా విద్యుత్ మీటర్లు, పబ్లిక్ టెలిఫోన్ పరికరాలు లేదా వాటి ఇన్స్టాలేషన్లను వాటి పనితీరుకు అంతరాయం కలిగించే లేదా నష్టం కలిగించే ఉద్దేశ్యంతో ట్యాంపర్ చేసే ఎవరికైనా SR3000 వరకు జరిమానా విధించబడుతుంది. పబ్లిక్ ఫెసిలిటీల రక్షణ చట్టం ప్రకారం.. ప్రజా సౌకర్యాలు అంతరాయం లేకుండా పనిచేస్తూనే ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. పబ్లిక్ సౌకర్యాలను దెబ్బతీయడానికి వివిధ ఉద్దేశాలను వివరిస్తాయి. ఈ నిబంధనలలో పేర్కొన్న ఏవైనా ఉల్లంఘనలు పునరావృతమైతే, జరిమానా రెట్టింపు అవుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!







