పబ్లిక్ రోడ్ను బ్లాక్ చేస్తే..గరిష్ఠంగా SR100000 జరిమానా..!!
- December 29, 2024
రియాద్: పబ్లిక్ ఫెసిలిటీస్ రక్షణ నిబంధనల ప్రకారం.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పబ్లిక్ రోడ్డు లేదా వరద డ్రైనేజీ మార్గాలను దెబ్బతీయడం, బ్లాక్ చేయడం చేస్తే దెబ్బతిన్న ప్రాంతాన్ని మరమ్మతు చేయడానికి అయ్యే ఖర్చులో 75 శాతం జరిమానా (SR100000 వరకు) విధించబడుతుంది. ఈ మేరకు మునిసిపాలిటీలు, హౌసింగ్ మంత్రి మాజిద్ అల్-హోగైల్ నిబంధనలను ఆమోదించారు. అదే విధంగా డ్రైనేజీ మార్గాలను దెబ్బతీస్తే మరమ్మతులతోపాటు 10 శాతం జరిమానా(SR100000 మించకుండా) విధిస్తారు. రోడ్లపై వాహనాలను కడిగితే, SR3000 జరిమానా విధిస్తారు.
నీరు లేదా విద్యుత్ మీటర్లు, పబ్లిక్ టెలిఫోన్ పరికరాలు లేదా వాటి ఇన్స్టాలేషన్లను వాటి పనితీరుకు అంతరాయం కలిగించే లేదా నష్టం కలిగించే ఉద్దేశ్యంతో ట్యాంపర్ చేసే ఎవరికైనా SR3000 వరకు జరిమానా విధించబడుతుంది. పబ్లిక్ ఫెసిలిటీల రక్షణ చట్టం ప్రకారం.. ప్రజా సౌకర్యాలు అంతరాయం లేకుండా పనిచేస్తూనే ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. పబ్లిక్ సౌకర్యాలను దెబ్బతీయడానికి వివిధ ఉద్దేశాలను వివరిస్తాయి. ఈ నిబంధనలలో పేర్కొన్న ఏవైనా ఉల్లంఘనలు పునరావృతమైతే, జరిమానా రెట్టింపు అవుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 4వ బెటాలియన్ను సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఖతార్లో నియంత్రిత మందులు తీసుకెళ్లే ప్రయాణికులకు కొత్త ఈ-పర్మిట్ విధానం
- ఏపీలో రూ.3,400 కోట్లతో జలధార జలహరతి పథకం
- సౌదీలో వారంలో 10,827 మంది అక్రమ వలసదారుల బహిష్కరణ..!!
- కొరియాలో యువతి మృతి..కే-పాప్ ఫ్యాన్ కమ్యూనిటీలో ఆన్లైన్ వేధింపులపై చర్చ..!!
- ఖతార్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు QR333 మిలియన్లు..!!
- నేషనల్ మ్యూజియం సమీపంలో 1,800 మీటర్ల వాకింగ్ ట్రాక్..!!
- కువైట్లో KD3,000 దాటితే బ్యాంక్ స్టేట్మెంట్ తప్పనిసరి..!!
- అర్హత ఉన్న భారతీయులందరికీ 10 ఏళ్ల పాస్పోర్టు..!!
- అండమాన్ సెల్యులార్ జైలులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్..







