దుబాయ్ హార్బర్ లో అగ్నిప్రమాదం.తప్పిన ప్రాణనష్టం..!!
- December 30, 2024
దుబాయ్: దుబాయ్ హార్బర్ ప్రాంతంలో బోటులో మంటలు చెలరేగాయి. కాగా, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇంధన కేంద్రం సమీపంలో ఆదివారం ఉదయం దుబాయ్ హార్బర్ ప్రాంతంలో బోటులో మంటలు చెలరేగాయి. దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఈ ఘటనపై స్పందించింది. తమకు ఉదయం 11:50 గంటలకు సమాచారం అందిందని తెలిపింది. దుబాయ్ హార్బర్ ఫైర్ స్టేషన్ నుండి సివిల్ డిఫెన్స్ సిబ్బంది మూడు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారని తెలిపారు. ఒక గంటలో మంటలు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నది.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. అయితే, ప్రమాదానికి గల కారణాలను సివిల్ డిఫెన్స్ వెల్లడించలేదు.
తాజా వార్తలు
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్







