దుబాయ్ హార్బర్ లో అగ్నిప్రమాదం.తప్పిన ప్రాణనష్టం..!!
- December 30, 2024
దుబాయ్: దుబాయ్ హార్బర్ ప్రాంతంలో బోటులో మంటలు చెలరేగాయి. కాగా, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇంధన కేంద్రం సమీపంలో ఆదివారం ఉదయం దుబాయ్ హార్బర్ ప్రాంతంలో బోటులో మంటలు చెలరేగాయి. దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఈ ఘటనపై స్పందించింది. తమకు ఉదయం 11:50 గంటలకు సమాచారం అందిందని తెలిపింది. దుబాయ్ హార్బర్ ఫైర్ స్టేషన్ నుండి సివిల్ డిఫెన్స్ సిబ్బంది మూడు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారని తెలిపారు. ఒక గంటలో మంటలు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నది.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. అయితే, ప్రమాదానికి గల కారణాలను సివిల్ డిఫెన్స్ వెల్లడించలేదు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







