యూఏఈలో మహిళా గ్యాంగ్స్టర్లకు జీవిత ఖైదు..!!
- January 03, 2025
యూఏఈ: దుబాయ్ క్రిమినల్ కోర్ట్ నలుగురు మహిళలతో కూడిన ఆఫ్రికన్ ముఠాకు జీవిత ఖైదు విధించింది. వారి శిక్షను అనుభవించిన తర్వాత దేశం నుండి బహిష్కరించాలని తన తీర్పులో ఆదేశించింది. ఈ ముఠా అక్రమంగా సైకోట్రోపిక్ పదార్థాలు, డ్రగ్స్ ను తీసుకొచ్చి అమ్మేవారని పోలీసులు కేసు నమోదు చేసారు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత రెండేళ్లపాటు నేరుగా లేదా మధ్యవర్తుల ద్వారా ఇతరులకు డబ్బు బదిలీ చేయడం లేదా డిపాజిట్ చేయకుండా కోర్టు వారిని నిషేధించింది. బిజినెస్ బే ప్రాంతంలో ఈ ముఠా సభ్యులు సైకోట్రోపిక్ పదార్థాలు, డ్రగ్స్ అమ్ముతుండగా పోలీసులు రెడ్ హ్యాండెండ్ గా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు డిపార్ట్మెంట్కు చెందిన బృందం ట్రాప్ను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఒక మహిళా పోలీసు అనుమానితుడితో కమ్యూనికేట్ చేసి, తాను సైకోట్రోపిక్ పదార్థాలను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు చెప్పిందని తెలిపారు. నిందితులు పేర్కొన్న రోజున, అతను మరో ఇద్దరు మహిళలు, వాహనం నడుపుతున్న ఒక వ్యక్తితో వచ్చి వారిని లొకేషన్ వద్ద పడేశాడు. 2,000 దిర్హామ్లకు బదులుగా మొదటి అనుమానితుడి నుండి నిషేధిత మందుల మాత్రల రూపంలో సైకోట్రోపిక్ పదార్థాలను అందుకున్నట్లు మహిళా పోలీసు విచారణలో పేర్కొంది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









