యూఏఈలో మహిళా గ్యాంగ్స్టర్లకు జీవిత ఖైదు..!!
- January 03, 2025
యూఏఈ: దుబాయ్ క్రిమినల్ కోర్ట్ నలుగురు మహిళలతో కూడిన ఆఫ్రికన్ ముఠాకు జీవిత ఖైదు విధించింది. వారి శిక్షను అనుభవించిన తర్వాత దేశం నుండి బహిష్కరించాలని తన తీర్పులో ఆదేశించింది. ఈ ముఠా అక్రమంగా సైకోట్రోపిక్ పదార్థాలు, డ్రగ్స్ ను తీసుకొచ్చి అమ్మేవారని పోలీసులు కేసు నమోదు చేసారు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత రెండేళ్లపాటు నేరుగా లేదా మధ్యవర్తుల ద్వారా ఇతరులకు డబ్బు బదిలీ చేయడం లేదా డిపాజిట్ చేయకుండా కోర్టు వారిని నిషేధించింది. బిజినెస్ బే ప్రాంతంలో ఈ ముఠా సభ్యులు సైకోట్రోపిక్ పదార్థాలు, డ్రగ్స్ అమ్ముతుండగా పోలీసులు రెడ్ హ్యాండెండ్ గా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు డిపార్ట్మెంట్కు చెందిన బృందం ట్రాప్ను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఒక మహిళా పోలీసు అనుమానితుడితో కమ్యూనికేట్ చేసి, తాను సైకోట్రోపిక్ పదార్థాలను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు చెప్పిందని తెలిపారు. నిందితులు పేర్కొన్న రోజున, అతను మరో ఇద్దరు మహిళలు, వాహనం నడుపుతున్న ఒక వ్యక్తితో వచ్చి వారిని లొకేషన్ వద్ద పడేశాడు. 2,000 దిర్హామ్లకు బదులుగా మొదటి అనుమానితుడి నుండి నిషేధిత మందుల మాత్రల రూపంలో సైకోట్రోపిక్ పదార్థాలను అందుకున్నట్లు మహిళా పోలీసు విచారణలో పేర్కొంది.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









