9,710 మంది ఖైదీలు పెరిగారు : డీజీ సౌమ్యమిశ్రా
- January 08, 2025
హైదరాబాద్: గతంతో పోల్చితే ఈ ఏడాదిలో 9710 మంది ఖైదీలు ఎక్కువగా జైల్లో ఉన్నారని డీజీ సౌమ్యమిశ్రా తెలిపారు. జైళ్ల శాఖ వార్షిక నివేదకను ఆమె విడుదల చేశారు. గత ఏడాదిలో 31,428 మంది ఖైదీలు జైల్లో ఉండగా..ఈ సారి 41,138 మంది ఉన్నారని చెప్పారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంతో పోల్చిస్తే వివిధ కేసుల్లో శిక్ష అనుభవించే వారి సంఖ్య సైతం పెరిగిందన్నారు. ఇందులో ఫోక్సో యాక్టు కింద నమోదైన కేసుల్లో 3655 మంది పురుషులు, 94 మంది మహిళలు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. ఎన్టీపీఎస్ యాక్ట్ కింద గతంలో 147 మంది మహిళలు శిక్ష అనుభవిస్తే.. ఈ సారి 312 మందిపై కేసు నమోదైందన్నారు. కోర్టు విచార ణలో 30,153 కేసులు ఉండగా.. 483 మంది ఖైదీలు జైళ్ల నుంచి విడుదల చేసిన్నట్లుగా పేర్కొ న్నారు. జైళ్లలో సీసీటీవీ, బాడీ వెర్ కెమెరాలు కోర్టు తేదీ వివరాలను అందరికి తెలిసేలా పెట్టామన్నా రు. ఈ ములఖత్వారా ఖైదీల కుటుంబ సభ్యుల తో వీడియో కాలామాట్లాడే అవకాశం కల్పించిన్న ట్లుగా చెప్పారు. 2650 మంది ఖైదీలకు నైపుణ్య శిక్షణ ఇప్పించి, ఇందులో 12,650 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దామన్నారు. ఈ ఏడాదిలో 303 మందికి పేరోల్ ఇచ్చామన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!







