9,710 మంది ఖైదీలు పెరిగారు : డీజీ సౌమ్యమిశ్రా
- January 08, 2025
హైదరాబాద్: గతంతో పోల్చితే ఈ ఏడాదిలో 9710 మంది ఖైదీలు ఎక్కువగా జైల్లో ఉన్నారని డీజీ సౌమ్యమిశ్రా తెలిపారు. జైళ్ల శాఖ వార్షిక నివేదకను ఆమె విడుదల చేశారు. గత ఏడాదిలో 31,428 మంది ఖైదీలు జైల్లో ఉండగా..ఈ సారి 41,138 మంది ఉన్నారని చెప్పారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంతో పోల్చిస్తే వివిధ కేసుల్లో శిక్ష అనుభవించే వారి సంఖ్య సైతం పెరిగిందన్నారు. ఇందులో ఫోక్సో యాక్టు కింద నమోదైన కేసుల్లో 3655 మంది పురుషులు, 94 మంది మహిళలు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. ఎన్టీపీఎస్ యాక్ట్ కింద గతంలో 147 మంది మహిళలు శిక్ష అనుభవిస్తే.. ఈ సారి 312 మందిపై కేసు నమోదైందన్నారు. కోర్టు విచార ణలో 30,153 కేసులు ఉండగా.. 483 మంది ఖైదీలు జైళ్ల నుంచి విడుదల చేసిన్నట్లుగా పేర్కొ న్నారు. జైళ్లలో సీసీటీవీ, బాడీ వెర్ కెమెరాలు కోర్టు తేదీ వివరాలను అందరికి తెలిసేలా పెట్టామన్నా రు. ఈ ములఖత్వారా ఖైదీల కుటుంబ సభ్యుల తో వీడియో కాలామాట్లాడే అవకాశం కల్పించిన్న ట్లుగా చెప్పారు. 2650 మంది ఖైదీలకు నైపుణ్య శిక్షణ ఇప్పించి, ఇందులో 12,650 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దామన్నారు. ఈ ఏడాదిలో 303 మందికి పేరోల్ ఇచ్చామన్నారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









