9,710 మంది ఖైదీలు పెరిగారు : డీజీ సౌమ్యమిశ్రా
- January 08, 2025
హైదరాబాద్: గతంతో పోల్చితే ఈ ఏడాదిలో 9710 మంది ఖైదీలు ఎక్కువగా జైల్లో ఉన్నారని డీజీ సౌమ్యమిశ్రా తెలిపారు. జైళ్ల శాఖ వార్షిక నివేదకను ఆమె విడుదల చేశారు. గత ఏడాదిలో 31,428 మంది ఖైదీలు జైల్లో ఉండగా..ఈ సారి 41,138 మంది ఉన్నారని చెప్పారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంతో పోల్చిస్తే వివిధ కేసుల్లో శిక్ష అనుభవించే వారి సంఖ్య సైతం పెరిగిందన్నారు. ఇందులో ఫోక్సో యాక్టు కింద నమోదైన కేసుల్లో 3655 మంది పురుషులు, 94 మంది మహిళలు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. ఎన్టీపీఎస్ యాక్ట్ కింద గతంలో 147 మంది మహిళలు శిక్ష అనుభవిస్తే.. ఈ సారి 312 మందిపై కేసు నమోదైందన్నారు. కోర్టు విచార ణలో 30,153 కేసులు ఉండగా.. 483 మంది ఖైదీలు జైళ్ల నుంచి విడుదల చేసిన్నట్లుగా పేర్కొ న్నారు. జైళ్లలో సీసీటీవీ, బాడీ వెర్ కెమెరాలు కోర్టు తేదీ వివరాలను అందరికి తెలిసేలా పెట్టామన్నా రు. ఈ ములఖత్వారా ఖైదీల కుటుంబ సభ్యుల తో వీడియో కాలామాట్లాడే అవకాశం కల్పించిన్న ట్లుగా చెప్పారు. 2650 మంది ఖైదీలకు నైపుణ్య శిక్షణ ఇప్పించి, ఇందులో 12,650 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దామన్నారు. ఈ ఏడాదిలో 303 మందికి పేరోల్ ఇచ్చామన్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్







