BD2,400 స్కామ్లో ఉపయోగించినవి నకిలీ ప్రభత్వ పత్రాలు..!!
- January 10, 2025
మనామా: యాభై ఏళ్ల వయసున్న బహ్రెయిన్ వ్యక్తి అందించిన ట్రేడ్మార్క్ సర్టిఫికెట్లు నకిలీవని గుర్తించిన తర్వాత ఒక ఆసియా వ్యాపారవేత్త BD2,400 స్కామ్ను బయటపెట్టాడు. కోర్టులో తప్పును ఒప్పుకున్న నిందితుడు.. ఈ పథకంలో భాగంగా మోసపూరిత పత్రాలను రూపొందించడానికి పరిశ్రమ, వాణిజ్య మంత్రిత్వ శాఖ టెంప్లేట్ను ఉపయోగించినట్లు అంగీకరించాడు. వ్యాపారవేత్త 2022లో ఇ-చెల్లింపు యాప్ ద్వారా నిందితుడికి నిధులను చెల్లించాడు. ఈ డబ్బు మంత్రిత్వ శాఖలో మూడు ట్రేడ్మార్క్ల రిజిస్ట్రేషన్కు వర్తిస్తుందని నిందితుడు నమ్మించాడు. కొంతకాలం తర్వాత, ట్రేడ్మార్క్లు అధికారికంగా నమోదు చేయబడ్డాయని నిర్ధారించే ముద్రిత సర్టిఫికెట్లను నిందితుడు అతనికి అందజేశాడు. అయితే, వ్యాపారవేత్తకు అనుమానం రావడంతో అతను మంత్రిత్వ శాఖకు వెళ్లి సర్టిఫికెట్లను తనిఖీ చేయాలని కోరాడు. అవి నకిలీవని తేలడంతో అతను అధికారులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







