యూఏఈలో ఘనంగా భారత రిపబ్లిక్ దినోత్సవం.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాస కుటుంబాలు..!!
- January 26, 2025
యూఏఈ: భారత 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. భారత జాతీయ గీతాన్ని ఆలపిస్తూ, త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ, దేశభక్తి గీతాలను ఆలపిస్తూ, 76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి వందలాది మంది భారతీయ ప్రవాసులు దౌత్య కార్యాలయాల వద్ద సంబరాల్లో పాల్గొన్నారు. దాదాపు 4 మిలియన్ల భారతీయ ప్రవాసుల భాగస్వామ్యంతో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని యూఏఈలో అతిపెద్ద ప్రవాస జనాభా వారి ఐక్యత, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించింది. దుబాయ్లో ఉన్న తన సోదరుడిని సందర్శించడానికి భరతనాట్యం నృత్యకారిణి మీనాక్షి మురళి మొదటిసారిగా ఎమిరేట్ కు వచ్చి, ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దుబాయ్ భారత కాన్సులేట్ జనరల్లో ప్రదర్శన ఇవ్వడం తనకు గర్వకారణం అన్నారు. యూఏఈ లోని ఇండియన్ స్కూల్స్ లలో కూడా గణతంత్ర దినోత్సవాలు కోలాహలంగా జరిగాయి. పిల్లలు భారతీయ జెండాను సగర్వంగా రెపరెపలాడిస్తూ సంప్రదాయ దుస్తులను ధరించి పాల్గొన్నారు.
దుబాయ్లో భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ భారత జెండాను ఆవిష్కరించడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం ప్రసంగిస్తూ 1950లో ఈ చారిత్రాత్మకమైన రోజున మన గణతంత్రానికి పునాది వేసిన నాయకులు, దేశభక్తులు, దార్శనికులు, స్వాతంత్ర్య సమరయోధులను సత్కరించారు. ఎమిరేట్స్లో భారతదేశం-యూఏఈ ద్వైపాక్షిక భాగస్వామ్యానికి మూలస్తంభాలుగా ఉన్న దాదాపు 4 మిలియన్ల మంది భారతీయ పౌరులతో కూడిన బలమైన సంఘం తమకు ఉందన్నారు. కృషి, అంకితభావం ద్వారా స్థానికుల ప్రశంసలు, గౌరవాన్ని పొందారని కొనియాడారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 125 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ మారక ద్రవ్యాల చెల్లింపుల్లో యూఏఈలోని భారతీయ కమ్యూనిటీ రెండవ అతిపెద్ద సహకారి అని కూడా కాన్సులర్ జనరల్ హైలైట్ చేశారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







