ఇండిగో ఎయిర్లైన్స్ వారి గొప్ప ఆఫర్లు
- June 30, 2016
ప్రయాణికులను ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థలు ఆఫర్ల బాటపట్టాయి. ఇప్పటికే గో ఎయిర్, ఎయిర్ ఏసియా పలు స్కీంలను అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా దేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్ ఇండిగో కూడా ప్రమోషనల్ ఆఫర్ సేల్ను ప్రకటించింది. అన్ని పన్నులతో కలిపి రూ. 1,106 ప్రారంభ ధరలతో విమాన టికెట్లు అందిస్తున్నట్లు తెలిపింది.
జులై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య దేశీయ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తించనుంది. దీని ప్రకారం.. రూ. 1,106కే శ్రీనగర్ నుంచి జమ్ముకు ప్రయాణించొచ్చు. ఇక దిల్లీ నుంచి లఖ్నవూకు రూ. 1,500. అహ్మదాబాద్ నుంచి ముంబయికి రూ. 1,200తో టికెట్ ధరలు ఉన్నట్లు ఇండిగో ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కింద ఎన్ని సీట్లు కేటాయించబోతోందన్నదన్న విషయాన్ని మాత్రం ఇండిగో స్పష్టం చేయలేదు.
సాధారణంగా వర్షాకాలంలో విమాన ప్రయాణికుల రద్దీ తక్కువ ఉంటుంది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థలు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







