భారత సాంస్కృతిక వైవిధ్యంపై కువైట్ రాయబారి ప్రశంసలు..!!

- January 28, 2025 , by Maagulf
భారత సాంస్కృతిక వైవిధ్యంపై కువైట్ రాయబారి ప్రశంసలు..!!

కువైట్: ఇండియా సాంస్కృతిక, మత, జాతి వైవిధ్యం, సహకార స్ఫూర్తిని భారత్ లోని కువైట్ రాయబారి మెషల్ అల్షెమాలి ప్రశంసలు కురిపించారు. గణతంత్ర దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానం మేరకు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్, సైనిక కవాతుకు ఆయన హాజరయ్యారు. భారతదేశ సైనిక పురోగతి, సాంస్కృతిక వైవిధ్యం, సాంకేతిక ఆవిష్కరణలను పరేడ్ సందర్భంగా ప్రదర్శించారని రాయబారి పేర్కొన్నారు. కువైట్-భారత సంబంధాలను మరింత పటిష్టం చేయాలనే కువైట్ నాయకత్వం ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. గత డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కువైట్‌ పర్యటన రెండు స్నేహపూర్వక దేశాల మధ్య రాజకీయ, వాణిజ్య, ఆర్థిక, రక్షణ, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో కొత్త పునాదులు వేసిందని, సంబంధాలను మరింత సమగ్రంగా, వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లిందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com