భారత సాంస్కృతిక వైవిధ్యంపై కువైట్ రాయబారి ప్రశంసలు..!!
- January 28, 2025
కువైట్: ఇండియా సాంస్కృతిక, మత, జాతి వైవిధ్యం, సహకార స్ఫూర్తిని భారత్ లోని కువైట్ రాయబారి మెషల్ అల్షెమాలి ప్రశంసలు కురిపించారు. గణతంత్ర దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానం మేరకు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్, సైనిక కవాతుకు ఆయన హాజరయ్యారు. భారతదేశ సైనిక పురోగతి, సాంస్కృతిక వైవిధ్యం, సాంకేతిక ఆవిష్కరణలను పరేడ్ సందర్భంగా ప్రదర్శించారని రాయబారి పేర్కొన్నారు. కువైట్-భారత సంబంధాలను మరింత పటిష్టం చేయాలనే కువైట్ నాయకత్వం ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. గత డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ పర్యటన రెండు స్నేహపూర్వక దేశాల మధ్య రాజకీయ, వాణిజ్య, ఆర్థిక, రక్షణ, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో కొత్త పునాదులు వేసిందని, సంబంధాలను మరింత సమగ్రంగా, వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లిందన్నారు.
తాజా వార్తలు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







