లేబర్ క్యాంపులో కత్తితో దాడి.. వ్యక్తికి 3 ఏళ్ల జైలుశిక్ష, బహిష్కరణ..!!
- January 31, 2025
యూఏఈ: దుబాయ్లోని లేబర్ క్యాంపులో జరిగిన వివాదంలో కత్తితో దాడికి పాల్పడిన ఘటనలో దుబాయ్ క్రిమినల్ కోర్టు ఒక వ్యక్తికి మూడు సంవత్సరాల జైలుశిక్ష, Dh50,000 జరిమానా విధించింది. ఈ సంఘటన డిసెంబర్ 30, 2023న దుబాయ్లోని అల్ క్వోజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది. కోర్టు రికార్డుల ప్రకారం.. ఇద్దరు భారతీయ పౌరులు షేరింగ్ రూమ్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించిన సమయంలో వివాదం చెలరేగి కత్తితో దాడికి పాల్పడే వరకు వచ్చింది. కత్తితో దాడికి పాల్పడిన తర్వాత 23 ఏళ్ల నిందితుడు లేబర్ క్యాంపులో నానా హంగామా చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకొని తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాధితుడిని రషీద్ ఆసుపత్రికి తరలించారు. లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
అలాగే బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి గొడవకు పాల్పడినందుకుగానూ నిందితులపై ప్రత్యేక నేరారోపణలు చేస్తూ న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. అదనంగా ఆరు నెలల జైలు శిక్ష, 100,000 దిర్హామ్ జరిమానా విధించారు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత నిందితుడిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







