తెలంగాణ సెక్రటేరియట్ను పేల్చి వేస్తానని బెదిరింపులు..
- February 04, 2025
హైదరాబాద్: తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సచివాలయానికి బాంబ్ పెట్టి పేల్చేస్తామని ఫోన్ చేసి బెదిరించడంతో.. భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయింది. వెంటనే బాంబు నిర్వీర్య బృందాలు, పోలీసులు రంగంలోకి దిగి సచివాలయాన్ని పరిశీలించారు. కానీ అది ఫేక్ కాల్ అని ఎలాంటి బాంబు లేదని తెలిసింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు SPF పోలీసులు. ఎందుకు ఫోన్ చేశాడనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
ఈ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి సయ్యద్ మీర్ మొహమద్ అలీ అని. వయసు ఇరవై రెండు సంవత్సరాలుగా గుర్తించారు పోలీసులు. సెక్రటేరియట్ ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి లంగర్ హౌస్ లోని దర్గా గురించి ఫిర్యాదు చేశారనీ. అందుకే తాను సెక్రటేరియట్ ను పేల్చి వేస్తానని ఈ యువకుడు బెదిరించినట్టు చెబుతున్నారు పోలీసులు. ఇతడ్ని దారుసలాం దర్గా దగ్గర పట్టుకున్నారు TGSPF పోలీసులు.. ఇతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!
- అన్ని ఎయిర్ యాక్టివిటీస్ ను నిలిపివేసిన ఒమన్..!!
- రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!
- విదేశాలలో చిక్కుకున్న నివాసితులు..ఖర్చులపై ఆందోళన..!!
- వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో
- భయం లేదు..అంతా ప్రశాంతం..యూఏఈ నివాసితులు..!!
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్









