తెలంగాణ సెక్రటేరియట్ను పేల్చి వేస్తానని బెదిరింపులు..
- February 04, 2025
హైదరాబాద్: తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సచివాలయానికి బాంబ్ పెట్టి పేల్చేస్తామని ఫోన్ చేసి బెదిరించడంతో.. భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయింది. వెంటనే బాంబు నిర్వీర్య బృందాలు, పోలీసులు రంగంలోకి దిగి సచివాలయాన్ని పరిశీలించారు. కానీ అది ఫేక్ కాల్ అని ఎలాంటి బాంబు లేదని తెలిసింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు SPF పోలీసులు. ఎందుకు ఫోన్ చేశాడనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
ఈ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి సయ్యద్ మీర్ మొహమద్ అలీ అని. వయసు ఇరవై రెండు సంవత్సరాలుగా గుర్తించారు పోలీసులు. సెక్రటేరియట్ ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి లంగర్ హౌస్ లోని దర్గా గురించి ఫిర్యాదు చేశారనీ. అందుకే తాను సెక్రటేరియట్ ను పేల్చి వేస్తానని ఈ యువకుడు బెదిరించినట్టు చెబుతున్నారు పోలీసులు. ఇతడ్ని దారుసలాం దర్గా దగ్గర పట్టుకున్నారు TGSPF పోలీసులు.. ఇతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!