సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనం తొలగింపు..
- February 14, 2025
సికింద్రాబాద్: తెలంగాణ రాజధానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలు నేలమట్ట మయ్యాయి.ఆధునికీకరణ పనుల్లో భాగంగా..1952లో కట్టిన సికింద్రాబాద్ స్టేషన్ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు గురువారం కూల్చివేశారు.దీంతో అప్పటి కళలు, సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలింది.1874లో అప్పటి నిజాం నవాబు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను నిర్మించారు.1916వరకు నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే(NGSR)కు ఇదే ప్రధాన స్టేషన్గా ఉండేది.1951లో NGSRను జాతీయం చేయడంతో ఇండియన్ రైల్వేస్ లో సికింద్రాబాద్ స్టేషన్ భాగమైంది.1952లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని అప్పటి ప్రభుత్వం నిర్మించింది. దీని పోర్టికో నిజాం ఆర్కిటెక్చర్కు అనుగుణంగా కోటను పోలి ఉంటుంది. ఇది ఇలా ఉంటే రూ.720 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ స్టేషన్ ను అధునీకరిస్తున్నారు. మరో ఏడాదిలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎయిర్పోర్టును తలపించేలా మారనుంది. చేపట్టిన స్టేషన్ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఐకానిక్ భవనాన్ని నేడు కూల్చివేశారు.
తాజా వార్తలు
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!









