సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనం తొలగింపు..
- February 14, 2025
సికింద్రాబాద్: తెలంగాణ రాజధానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలు నేలమట్ట మయ్యాయి.ఆధునికీకరణ పనుల్లో భాగంగా..1952లో కట్టిన సికింద్రాబాద్ స్టేషన్ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు గురువారం కూల్చివేశారు.దీంతో అప్పటి కళలు, సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలింది.1874లో అప్పటి నిజాం నవాబు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను నిర్మించారు.1916వరకు నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే(NGSR)కు ఇదే ప్రధాన స్టేషన్గా ఉండేది.1951లో NGSRను జాతీయం చేయడంతో ఇండియన్ రైల్వేస్ లో సికింద్రాబాద్ స్టేషన్ భాగమైంది.1952లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని అప్పటి ప్రభుత్వం నిర్మించింది. దీని పోర్టికో నిజాం ఆర్కిటెక్చర్కు అనుగుణంగా కోటను పోలి ఉంటుంది. ఇది ఇలా ఉంటే రూ.720 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ స్టేషన్ ను అధునీకరిస్తున్నారు. మరో ఏడాదిలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎయిర్పోర్టును తలపించేలా మారనుంది. చేపట్టిన స్టేషన్ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఐకానిక్ భవనాన్ని నేడు కూల్చివేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







