యూఏఈలో ప్రాథమిక ఉత్పత్తుల ధరల పెంపుపై మంత్రి క్లారిటీ..!!
- February 17, 2025
యూఏఈ: యూఏఈలోని ప్రధాన రిటైలర్లు తొమ్మిది ప్రాథమిక వినియోగ వస్తువుల కోసం కొత్త ధరల విధానాన్ని అమలు చేస్తున్నారని, ధరలను పెంచలేదని యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రి తెలిపారు. వంట నూనె, గుడ్లు, పాల ఉత్పత్తులు, బియ్యం, చక్కెర, పౌల్ట్రీ, చిక్కుళ్ళు, బ్రెడ్, గోధుమలు తొమ్మిది ప్రాథమిక వినియోగ వస్తువుల ధరలు మార్గదర్శకాలకు అనుగుణంగా స్పష్టంగా ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అల్ మర్రి యూనియన్ కోప్, లులు ఇతర ఐదు ప్రధాన అవుట్లెట్లను సందర్శించారు.
డిసెంబరు 2024న, ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందస్తు అనుమతి లేకుండా తొమ్మిది ప్రాథమిక వినియోగ వస్తువుల ధరలను రిటైలర్లు పెంచలేరని పేర్కొంది. 2025 నుండి బేసిక్ కమోడిటీల ధరలలో వరుసగా రెండు పెరుగుదలల మధ్య కనీసం ఆరు నెలల సమయం ఉంటుందని తెలిపింది. కొత్త విధానంలో వస్తువుల ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని రిటైలర్లను కోరింది.
తాజా వార్తలు
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









