యూఏఈలో ప్రాథమిక ఉత్పత్తుల ధరల పెంపుపై మంత్రి క్లారిటీ..!!
- February 17, 2025
యూఏఈ: యూఏఈలోని ప్రధాన రిటైలర్లు తొమ్మిది ప్రాథమిక వినియోగ వస్తువుల కోసం కొత్త ధరల విధానాన్ని అమలు చేస్తున్నారని, ధరలను పెంచలేదని యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రి తెలిపారు. వంట నూనె, గుడ్లు, పాల ఉత్పత్తులు, బియ్యం, చక్కెర, పౌల్ట్రీ, చిక్కుళ్ళు, బ్రెడ్, గోధుమలు తొమ్మిది ప్రాథమిక వినియోగ వస్తువుల ధరలు మార్గదర్శకాలకు అనుగుణంగా స్పష్టంగా ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అల్ మర్రి యూనియన్ కోప్, లులు ఇతర ఐదు ప్రధాన అవుట్లెట్లను సందర్శించారు.
డిసెంబరు 2024న, ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందస్తు అనుమతి లేకుండా తొమ్మిది ప్రాథమిక వినియోగ వస్తువుల ధరలను రిటైలర్లు పెంచలేరని పేర్కొంది. 2025 నుండి బేసిక్ కమోడిటీల ధరలలో వరుసగా రెండు పెరుగుదలల మధ్య కనీసం ఆరు నెలల సమయం ఉంటుందని తెలిపింది. కొత్త విధానంలో వస్తువుల ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని రిటైలర్లను కోరింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







