బాగ్దాద్ లో వరుస బాంబు పేలుళ్లు

- July 02, 2016 , by Maagulf
బాగ్దాద్ లో వరుస బాంబు పేలుళ్లు

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఆదివారం ఉదయం వరుస పేలుళ్లు సంభవించాయి. రద్దీగా ఉన్న మార్కెట్లో జరిగిన ఈ బాంబు దాడిలో 20 మంది మృతి చెందారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 

నగరంలోని రద్దీ ప్రాంతాలైన కరాదా-డాఖిల్‌, షల్లాల్‌ మార్కెట్‌ వద్ద ఈ ఘటన జరిగింది. తొలుత కరాదా వద్ద కారులో వచ్చిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 11మంది మృతిచెందగా.. మరో 22 మంది గాయపడ్డారు. పలు దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే షల్లాల్‌ మార్కెట్లో మరో పేలుడు సంభవించింది. ఈ దాడిలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com