ప్రొ కబడ్డీ సీజన్-4లో జాతీయ గీతం పడనున్న 'రానా దగ్గుబాటి'
- July 03, 2016
ప్రొ కబడ్డీ సీజన్-4లో 'భల్లాలదేవ' రానా దగ్గుబాటి సందడి చేయనున్నారు. ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న రానా.. ఆదివారం సొంతగడ్డపై జరిగే మ్యాచ్కు ముందు జాతీయ గీతం ఆలపించనున్నారు. ఆదివారం టైటాన్స్ జట్టు పట్నా పైరేట్స్తో తలపడనుంది. రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో మ్యాచ్లు జరుగుతాయి. మిగతా మూడు రోజుల్లో ముధుమిత మోహపాత్ర, రకుల్ ప్రీత్సింగ్, మెర్లిన్ డిసౌజా జాతీయగీతం ఆలపించనున్నారు.
రానా.. తెలుగు టైటాన్స్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సీజన్ 4లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలోనూ పరాజయం పొందిన టైటాన్స్ జట్టు.. నేటి నుంచి సొంతగడ్డపై పోటీ పడనుంది. హైదరాబాద్లో మూడు మ్యాచ్లు ఆడనుంది. ఇక హైదరాబాద్లోనే రానా జట్టు, కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ జట్టుతో తలపడనుంది. జులై 5న టైటాన్స్.. బెంగళూరు బుల్స్ మ్యాచ్ జరగనుంది.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







