ప్రొ కబడ్డీ సీజన్‌-4లో జాతీయ గీతం పడనున్న 'రానా దగ్గుబాటి'

- July 03, 2016 , by Maagulf
ప్రొ కబడ్డీ సీజన్‌-4లో జాతీయ గీతం పడనున్న 'రానా దగ్గుబాటి'

ప్రొ కబడ్డీ సీజన్‌-4లో 'భల్లాలదేవ' రానా దగ్గుబాటి సందడి చేయనున్నారు. ఈ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న రానా.. ఆదివారం సొంతగడ్డపై జరిగే మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం ఆలపించనున్నారు. ఆదివారం టైటాన్స్‌ జట్టు పట్నా పైరేట్స్‌తో తలపడనుంది. రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి. మిగతా మూడు రోజుల్లో ముధుమిత మోహపాత్ర, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, మెర్లిన్‌ డిసౌజా జాతీయగీతం ఆలపించనున్నారు.
రానా.. తెలుగు టైటాన్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సీజన్‌ 4లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ పరాజయం పొందిన టైటాన్స్‌ జట్టు.. నేటి నుంచి సొంతగడ్డపై పోటీ పడనుంది. హైదరాబాద్‌లో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఇక హైదరాబాద్‌లోనే రానా జట్టు, కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ జట్టుతో తలపడనుంది. జులై 5న టైటాన్స్‌.. బెంగళూరు బుల్స్‌ మ్యాచ్‌ జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com