నకిలీ పాస్‌పోర్ట్ స్టాంపుల కేసు..మార్చి 2కు తీర్పు వాయిదా..!!

- February 25, 2025 , by Maagulf
నకిలీ పాస్‌పోర్ట్ స్టాంపుల కేసు..మార్చి 2కు తీర్పు వాయిదా..!!

మనామా: 2016లో సముద్రం ద్వారా బహ్రెయిన్‌ నుండి పారిపోయిన వ్యక్తి సంవత్సరాల తర్వాత విమానాశ్రయం ద్వారా నకిలీ రెన్యూవల్ స్టాంపులు కలిగి ఉన్న పాస్‌పోర్ట్‌తో తిరిగి వచ్చాడు. ఇమ్మిగ్రేషన్ అధికారి అతడిని గుర్తించడంతో అదుపులోకి తసుకున్నారు.  ఇప్పుడు అతడి కేసుపై హై క్రిమినల్ కోర్ట్ లో విచారణ జరుగుతుంది. డిఫెన్స్‌ పిటిషన్‌పై విచారణను మార్చి 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

నిందితుడు ఇరాన్‌కు వెళ్లి అక్రమంగా ఉంటున్నాడని, దొంగ పాస్ పోర్టుతో తిరిగి వచ్చేందుకు ప్రయత్నించాడని అనేక ఆరోపణలపై ఎదుర్కొంటున్నాడు. అయితే, అతను బహ్రెయిన్‌కు తిరిగి వచ్చినప్పుడు, అతను ఇమ్మిగ్రేషన్ వద్ద అతడిన పాస్‌పోర్ట్‌ను సమర్పించగా అందులో స్టాంపులు అనుమానస్పదంగా ఉండటంతో అధికారులు అలెర్ట్ అయ్యారు.  బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ఒక అధికారి, సాధారణ తనిఖీలు చేస్తున్నప్పుడు, సిస్టమ్ ఇప్పటికీ వ్యక్తి దేశంలోనే ఉన్నట్లు చూపడాన్ని గమనించాడు. తదుపరి పరిశీలనలో అతడు వాంటెడ్ వ్యక్తి అని తేలింది. సముద్ర మార్గంలో పారిపోయినట్లు అంగీకరించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com