SLBC సొరంగంలోకి స్వయంగా వెళ్లి సహాయక చర్యలు పరిశీలించిన సీఎం రేవంత్
- March 02, 2025
తెలంగాణ: శ్రీ శైలం ఎడమ గట్టు కాలువ (SLBC)లో కార్మికులు చిక్కుకుపోయిన చోట సహాయక చర్యలు కొనసాగుతున్న వేళ అక్కడకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు వెళ్లారు. నాగర్కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం ఘటనపై అధికారులతో రివ్యూ మీటింగ్ లోనూ వారు పాల్గొన్నారు.ఎస్ఎల్బీసీ సొరంగంలోకి స్వయంగా వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు.
ఎంత రిస్క్ అయినా సరే ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు.భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదనపు బలగాలను రంగంలోకి దింపి, ఆపరేషన్ను ముందుకు తీసుకుపోవాలని అన్నారు.
మిగతా టన్నెల్ కంటే ఇది పూర్తి భిన్నమైన టన్నెల్ అని చెప్పారు. వెంటనే చేయవలసిన పనులపై నివేదిక ఇవ్వాలని అన్నారు. అధికారులతో సహాయక చర్యలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను సీఎం, మంత్రులకు సహాయక చర్యల బృందం వివరించింది.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









