మానవ అక్రమ రవాణా కేసు..మహిళ పై విచారణ..!!

- March 04, 2025 , by Maagulf
మానవ అక్రమ రవాణా కేసు..మహిళ పై విచారణ..!!

మనామా: మానవ అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళపై మార్చి 11న హై క్రిమినల్ కోర్టులో విచారణ జరుగనుంది. ఆమె ఒక గృహ కార్మికురాలిని బలవంతంగా ఉద్యోగంలో నియమించి, ఆమె వేతనాలను తీసుకున్నారని, ఆమె దేశం విడిచి వెళ్లకుండా ఆపడానికి పాస్‌పోర్ట్‌ను తన వద్ద ఉంచుకున్నారని ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు.

ఆ మహిళ సరైన వర్క్ పర్మిట్ లేకుండా కార్మికురాలిని అనేక ఇళ్లలో పని చేయించిందని ఆరోపిస్తూ మానవ అక్రమ రవాణా నిరోధక , ప్రజా నైతిక రక్షణ డైరెక్టరేట్ ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసింది. పరిస్థితులు చట్టపరరంగా లేవని, కార్మికురాలు వెళ్ళిపోయే మార్గం లేదని దర్యాప్తు అధికారులు తెలిపారు.

అధికారులు బాధితురాలిని, సాక్షులను విచారించారు.  ఆరోపణలకు మద్దతు ఇచ్చే సాక్ష్యాలను సేకరించారు. పోలీసు విచారణలో బాధితురాలు చెప్పిన విషయాలు వాస్తవాలని తేలాయి. కేసు పూర్తయిన తర్వాత, ప్రాసిక్యూషన్ దానిని విచారణ కోసం కోర్టు ముందుకు తీసుకొచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com